Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Akhanda రిలీజ్కు ముందు తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం.. టికెట్ రేట్ల పెంపుపై కీలక ఆదేశాలు!
కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ సంక్షోభంలో మునిగిపోయింది. దాదాపు ఏడాదికిపైగా సినిమా థియేటర్లు మూతపడటంతో సినీ కార్మికులు, యాజమాన్యాలు రోడ్డున పడ్డారు. ఇటీవల థియేటర్లు ఓపెన్ కావడంతో ప్రేక్షకుల స్పందన అంతంతా మాత్రంగానే ఉంది. దాంతో సినీ పరిశ్రమ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నది.
ఇలాంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్తో రూపొందించిన ఆచార్య, RRR, పుష్ప, అఖండ, రాధేశ్యామ్ లాంటి సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. అయితే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంపు అంశంపై నిరాసక్తతతో ఉన్నాయి. అయితే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించాలనే ఇటీవల థియేటర్ యాజమాన్యాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఇటీవల టికెట్ రేట్లు పెంపుపై థియేటర్ యాజమాన్యాలు తెలంగాణా సర్కార్కు వినతి పత్రం సమర్పించారు. అఖండ, RRR, పుష్ప లాంటి సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేటును 50 రూపాయల మేరకు పెంచుకొనేలా అవకాశం కల్పించండి అని తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ థియేటర్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. టికెట్పై రూ.50 పెంచుకొనే విధంగా వెసులుబాటును హైకోర్టు కల్పించింది.
Recommended Video
టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై థియేటర్ యాజమాన్యాల తరఫు న్యాయవాది స్పందించారు. టికెట్ రేట్ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న రేట్లకు అదనంగా టికెట్ ఒక్కంటికి 50 రూపాయలు పెంచుకొనే విధంగా అవకాశం కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.