Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
దేవాలయాల్లా..ముస్తాబైన శ్రీరామ రాజ్యం థియేటర్లు
పారాణికం సినిమాలకు సీనియర్ ఎన్టీఆర్ పెట్టింది పేరు. రాముడి, కృష్ణుడిగా యావత్ తెలుగు ప్రజలందరినీ ఓలలాడించారాయన. నిజంగా దేవుడు ఎలావుంటారో అప్పటి వరకు చూడని తెలుగు జనవాహిని..ఎన్టీ రామారావును ప్రత్యక్షదైవంగా పూజించేవారు. ఆయన నటించిన పౌరాణిక సినిమా విడుదలవుతుందంటే పూజలతో థియేటర్లు దేవాలయాల్లా మారేవి. ప్రేక్షకుల మదిలో సినిమా దేవుడిగా అంత బలంగా పాతుకు పోయారు ఎన్టీఆర్. ఆయన తర్వాత ఎవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేక పోయారనే చెప్పాలి.
తాజాగా....నందమూరి బాలకృష్ణ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు, తండ్రి పేరు నిలబెట్టేందుకు కంకణం కట్టుకున్నారు. ఆయన నటించిన శ్రీరామ రాజ్యం సినిమా రేపు(నవంబర్ 17)న విడుదలవ్వబోతోంది. బాలయ్య ఇందులో లార్డ్ రామాగా నటించగా, సీత పాత్రలో నయన తార నటించింది. సినిమా విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు అమెరికాలోనూ థియేటర్లన్నీ దేవాలయాలుగా మారిపోయాయి. నందమూరి అభిమానులు థియేటర్ల ఆవరణలో భారీ కటౌట్లు కట్టి, సీతారాము, లక్ష్మణ విగ్రహాలు పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు.
మన రాష్ట్రంలో ఇలాంటి కొత్తగా అనిపించక పోవచ్చుగానీ అమెరికాలోనూ ఇలాంటి ఏర్పాట్లు చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. అమెరికాలోని థియేటర్లలో ఈ ఏర్పాట్లను చూసి ఆశ్యర్య పోతున్నారు...అమెరికా జనాలు.