Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అందరితో బాబాయ్ అనిపించుకున్న టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి.. ఆదివారం రాత్రి ఏమైదంటే?
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. కొందరు కరోనా కారణంగా మరణించగా మరి కొందరు ఇతర అనారోగ్య కారణాలతో మరణిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది..ఆ వివరాల్లోకి వెళితే
సీనియర్ నటుడు మృతి
టాలీవుడ్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు మరణించారు. అరవై నాలుగేళ్ల రాజా బాబు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.
రాజబాబు మృతితో ఒక్కసారిగా టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజబాబు మరణించారు అనే విషయం తెలుసుకుని టాలీవుడ్ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఆ సినిమాతో
రాజబాబు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో 1957 జూన్ 13న జన్మించారు. రాజబాబు తండ్రి నాటకాలు ఆడుతూ ఉండే వారు. దీంతో చిన్నప్పటి నుండి నటనపై ఎంతో ఆసక్తి కలిగిన రాజబాబు సైతం అనేక నాటకాల్లో నటించారు. దేశవ్యాప్తంగా తిరిగి నాటక ప్రదర్శనలు ఇచ్చిన ఆయన 1995లో హీరో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఊరికి మొనగాడు అనే సినిమాతో టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
ఎక్కువగా ఆ డైరెక్టర్ సినిమాల్లోనే
అలా మొదలైన రాజబాబు నటనా ప్రస్థానం మొన్నటి వరకు సాగింది. ఎక్కువగా కృష్ణ వంశీ సినిమాల్లో ఆయన కనిపించేవారు. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారీ, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1995 నుంచి సుమారు 62 సినిమాల్లో కాq విభిన్నమైన పాత్రలు పోషించారు రాజబాబు. గోదావరి పల్లెటూరి పాత్రాలకు రాజబాబు చాలా చక్కగా సరిపోయే వారు.
సీరియల్స్ లో సైతం
రాజబాబు యాసకు, ఆహార్యానికి ఆ పాత్రలు చక్కగా కుదిరేవి, అందుకే గోదారి పాత్రలకు ఆయనను దర్శక నిర్మాతలు వెతికి మరీ ఫైనల్ చేసేవారు. సినిమాలే కాకుండా అనేక సీరియల్స్ లో రాజబాబు నటించారు. బుల్లితెరలో సూపర్ హిట్ అయిన వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి లాంటి సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులకు సైతం రాజబాబు సుపరిచితమే.
Recommended Video
బాబాయ్ అని ఆప్యాయంగా
2005లో
అమ్మ
సీరియల్లోని
పాత్రకుగానూ
ఆయన్ని
నంది
అవార్డు
వరించింది.
రాజబాబు
కెరీర్లో
ఇప్పటి
వరకు
దాదాపు
48
సీరియల్స్లో
నటించారు.
రాజబాబుకు
భార్య
,
ఇద్దరు
మగపిల్లలు
,ఒక
ఆడపిల్ల
వున్నారు.
తెర
మీద
సరదా
పాత్రలు
చేసే
రాజబాబును
టాలీవుడ్
నటులు
అందరూ
బాబాయ్
అని
ఆప్యాయంగా
పిలిచేవారు.
సెట్
లో
సైతం
తన
చుట్టూ
వున్న
వారిని
హాయిగా
నవ్విస్తూ
వుండే
రాజ
బాబు
మరణించారన్న
వార్త
దిగ్బ్రాంతికి
గురి
చేస్తోంది.