మేగజైన్ కోసం చెర్రీ వైఫ్ ఉపాసన ఫోజులు!(ఫోటోలు)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటు రామ్ చరణ్ ఫ్యామిలీతో పాటు, అటు ఉపాసన ఫ్యామిలీ కూడా సంఘంలో బాగా పేరున్న కుటుంబాలు కావడంతో దేశం నలుమూలల నుంచి సినీ, వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.
ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా, సాఫీగా సాగుతోంది. రామ్ చరణ్ తన సినిమా ప్రొఫెషన్లో బిజీగా గడుపుతుంటే, ఉపాసన కూడా తను ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల ఉపాసన రిట్జ్ అనే లైఫ్ స్టైల్ మేగజైన్ కోసం ప్రత్యేకంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పాటు, తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను సదరు మేగజైన్తో పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలతో పాటు, ఆమె చెప్పిన వివరాలు స్లైడ్ షోలో...

చరణ్ బెస్ట్ ఫ్రెండ్
చరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, అతన్ని పెళ్లి చేసుకోవడం తన జీవితంలో ఎంతో సంతోషకర విషయమని ఉపాసన చెప్పుకొచ్చారు.

తాతయ్య ప్రభావం
ఉపాసన తాతయ్య, అపోలో గ్రూఫ్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి. ఆయన ప్రభావం తనపై ఎంతో ఉందని, ఆయన పాటిజివ్ థికింగ్, ఆయన ఆలోచన విధానం తనలో ఎంతో మార్పును తెచ్చిందని ఉపాసన రిట్జ్ మేగజైన్ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు.

అత్తారింట్లో...
పెళ్లయిన తర్వాత ఉపాసన అత్తారింటికి చేరుకున్నారు. అత్తమామలు చిరంజీవి, సురేఖ తనను ఎంతో బాగా చూసుకుంటున్నారని ఉపాసన మాటల్లో స్పష్టం అవుతోంది.

సంసార జీవితం
రామ్ చరణ్తో ఉపాసన సంసార జీవితంతో ఎంతో సంతోషంగా సాగుతోంది. చరణ్ తన ఆలోచనలకు ఎంతో విలువ విలునిస్తాడని, అన్ని విషయాల్లోనూ తనకు సపోర్ట్గా నిలుస్తాడిన అంటున్నారు ఉపాసన.
Courtesy: RITZ


Click it and Unblock the Notifications











