Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
22ఏళ్ళ పాప్ సింగర్ హత్య:ఆటోగ్రాఫ్ ఇస్తూండగానే కాల్చేసాడు
అమెరికాలోని ఓర్లాండోలో పాప్ సింగర్ క్రిస్టినా గ్రిమ్మీ(22) దారుణ హత్యకు గురైంది. యూట్యూబ్ స్టార్ గా, అమెరికన్ పాప్ సింగర్ గా పేరుపొందిన ఆమెపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. టీవీ షో 'బి ఫోర్ యు ఎగ్జిట్' ప్రదర్శన ముగిశాక ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. ఆమె అభిమానులతో ముచ్చటిస్తూ వారికి ఆటోగ్రాఫ్ ఇస్తోన్న సమయంలో ఓ దుండగుడు ఆమెపై కాల్పులు జరిపి, అనంతరం తనని తాను కాల్చుకొని చనిపోయాడు.
దాడిలో గాయపడ్డ గాయని క్రిస్టీనా మృతిచెందినట్లు ఒర్లాండో పోలీసులు ట్విట్టర్లో పేర్కొన్నారు. గాయని సోదరుడు సాయుధున్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కొంత సేపు వాళ్ల మధ్య పెనుగులాట జరిగింది. ఆ తర్వాత సాయుధుడు తనను తాను కాల్చుకున్నాడు. గన్తో దాడి చేసింది ఎవరన్నది ఇంకా పోలీసులు గుర్తుపట్టలేదు. ఆ వ్యక్తి ఎందు కోసం కాల్పులకు దిగాడో కూడా ఇంకా తెలియరాలేదు.
ద వాయిస్ పాటల పోటీల సిరీస్లో సింగర్ క్రిస్టీనా ఒకసారి మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆమెకు యూట్యూబ్లో అభిమానులు విపరీతంగా పెరిగారు. ఆమె వీడియోలకు లక్షల సంఖ్యలో హిట్లు కూడా వచ్చాయి. చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న క్రిస్టినా..ఇంత ధారుణం గా మరణించతం అంతర్జాతీయ సంగీతాభిమానులను విచారనికి గురిచేస్తోంది...