Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
మహేష్ బాబు కొత్త చిత్రం ప్రకటన (అఫీషియల్)
హైదరాబాద్ : నేనొక్కడినే '1' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మహేష్బాబు. ఈ నెలలోనే 'ఆగడు' కూడా సెట్స్పైకి వెళ్లనుంది. ఈలోగా మరో కొత్త చిత్రం కమిటయ్యారు. మహేష్బాబు హీరోగా యూటీవీ మోషన్ పిక్చర్స్, ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 'మిర్చి'తో ఆకట్టుకొన్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. 2014 జులైలో సెట్స్పైకి వెళ్లనుంది.
మహేష్బాబు మాట్లాడుతూ ''యూటీవీ సంస్థతో ఓ చిత్రం చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇందిర ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో యు.టి.వి. తెలుగులో నిర్మిస్తున్న తొలిచిత్రంలో నేను పాలుపంచుకోవడం ఆనందంగా వుంది. యు.టి.వి. సంస్థ తెలుగులో గొప్ప విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
యు.టి.వి. దక్షిణాది బిజినెస్-స్టూడియోస్ అధ్యక్షుడు ధనంజయన్ మాట్లాడుతూ 'భారతదేశంలో హిందీ తర్వాత రెండో పెద్ద చిత్ర పరిశ్రమ అయినా తెలుగులో మా ప్రస్థానాన్ని ప్రారంభిస్తుండటం ఆనందంగా వుంది. అత్యున్నత ప్రమాణాలతో తెలుగుప్రేక్షకులు గర్వించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తాం. తెలుగులో మా సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రమిది. మహేష్బాబులాంటి హీరో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. అన్ని వర్గాలను అలరించే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది''అన్నారు .
''నా మూడో చిత్రం మహేష్తో చేయడం సంతోషంగా ఉంద''ని దర్శకుడు చెప్పారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.