Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ లేకపోతే ఈ సినిమా లేదు!
వంశీ పైడిపల్లి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'ఎవడు'. రామ్చరణ్, శ్రుతిహాసన్ జంటగా నటించారు. అమీజాక్సన్ మరో హీరోయిన్. అల్లు అర్జున్, కాజల్ అతిథి పాత్రల్లో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దిల్ రాజు మాట్లాడుతూ... ''పవన్కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' విడుదల తేదీని దృష్టిలో ఉంచుకొని 'ఎవడు'ని వాయిదా వేయాలనుకొన్నాం. కానీ 'జంజీర్' విడుదల తేదీని ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ప్రత్యామ్నాయం లేకపోవడంతో 31న విడుదల చేస్తున్నాం. ఇదివరకు హిందీలో 'లగాన్', 'గదర్' చిత్రాలు వెంటవెంటనే విడుదలై చరిత్రను సృష్టించాయి. ఆ తరహాలోనే ఈ రెండు చిత్రాలూ విజయం సాధిస్తాయన్న నమ్మకం ఉంది'' అన్నారు
అలాగే ''మా సంస్థ నుంచి ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలే రూపుదిద్దుకున్నాయి. వాటికి భిన్నంగా వాణిజ్య హంగులతో ఓ చిత్రాన్ని తీయాలనుకొన్నాం. 'ఎవడు'తో అది కుదిరింది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 'మగధీర' విడుదలైన రోజున ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం ఓ చరిత్రను సృష్టిస్తుందన్న నమ్మకం ఉంది''అన్నారు.