Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
అయ్యో..! అసలు ఊహించలేం., రకుల్ కే అమ్మ పాత్ర చేస్తోంది
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తెరకెక్కుస్తున్న కొత్త సినిమాలో వాణి విశ్వనాథ్ ఓ కీలక పాత్ర తో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది
టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన 'ఘరానా మొగుడు'..'కొదమసింహం'..చిత్రాల్లో నటించిన 'వాణీ విశ్వనాథ్' గుర్తుండే ఉంటుంది కదా...తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించిన ఈ గ్లామర్ తార కొన్నాళ్లుగా చిత్రాలకు దూరంగా ఉండిపోయింది. ఎన్టీఆర్ మొదలుకొని.. 90లలో తెలుగు అగ్ర కథానాయకులెందరితోనో ఆడిపాడిన ఈ మలయాళీ భామ.. దక్షిణాది భాషా చిత్రాలతో పాటు.. హిందీలోనూ నటించింది. అయితే.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన వాణి విశ్వనాథ్.. మళ్లీ ఇప్పుడు తెలుగులో బడా డైరెక్టర్ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తెరకెక్కుస్తున్న కొత్త సినిమాలో వాణి విశ్వనాథ్ ఓ కీలక పాత్ర చేస్తోందట. ఈ సినిమాలో జగపతి బాబు.. శరత్ కుమార్.. సుమన్ లాంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. బోయపాటి తన ప్రతి సినిమాలోనూ సీనియర్లకు మూడు నాలుగు కీలక పాత్రలు సెట్ చేసి పెడుతుంటాడు.
ఇప్పుడు వాణీని ఏరి కోరి ఈ పాత్రకు ఎంచుకున్నాడంటే అందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని భావిస్తున్నారు. అందరూ మరిచిపోయిన వాణిని బోయపాటి గుర్తుంచుకుని ఆమెకు ఓ ముఖ్య పాత్ర ఇవ్వడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్.. ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.