Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అఫీషియల్: వరుణ్ తేజ నెక్ట్స్ చిత్రం ప్రకటన
హైదరాబాద్ : 'ముకుంద' చిత్రంతో పరిచయమైన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తన తదుపరి చిత్రం ప్రకటన వచ్చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది ఈ మేరకు పోస్టర్ విడుదల చేసారు. ఈ రోజు వరుణ్ తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేసారు.
పాఠకుల
కోసం
ఫేస్బుక్
ద్వారా
ఎప్పటికప్పుడు
తాజా
వార్తలు...
లైక్
చేయండి.
పూర్తి
వివరాల్లోకి
వెళితే...
తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'ముకుంద' చిత్రాన్ని చేసిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు.
అలాగే, ఈ కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు కల్యాణ్ తెలిపారు. నితిన్ తో ఒక సినిమా, నాగచైతన్య తో ఒక సినిమా ప్లానింగులో వున్నాయని చెప్పారు.
'కేడీ' సినిమా తర్వాత నాగార్జునతో ఓ సినిమా నిర్మించాల్సివుందనీ, సరైన కథ దొరకక ఇంకా సెట్స్ కి వెళ్ళలేదనీ అన్నారు. ఇటీవలే నాగార్జున కోసం... నలుగురు అమ్మాయిల మధ్య హీరో అనే కాన్సెప్టుతో ఓ కథ విన్నానని ఆయన తెలిపారు. ఇది నాగార్జునకు బాగా సూటవుతుందని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా తమకు వచ్చే ఏడాది ఓ సినిమా వుందని నిర్మాత కల్యాణ్ తెలియజేశారు.