Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘కరుణామయుడు’గా చేయటం వెనక..: విజయ్ చందర్
హైదరాబాద్ : జీసస్ అంటే విజయ్ చందర్ టక్కున గుర్తుకు వస్తారు. చిత్రం అంత గొప్పగా రావటానికి కారణం విజయ్ చందర్ అని అందరూ ఒప్పుకునే విషయం. అయితే హఠాత్తుగా విజయ్ చందర్ కి ఎందుకు ఏసుక్రీస్తు పాత్ర వేయాలనిపించింది అనేది మాత్రం అందరికీ సందేహమే. అయితే ఈ సందేహానికి సమాధానాన్ని విజయ్ చందర్ స్వయంగా ఇచ్చారు.
విజయ్ చందర్ మాట్లాడుతూ...ఏసుప్రభు పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ... 69లో తంగప్ప అనే డాన్స్మాస్టర్ 'మేరీమాత' చిత్రాన్ని తీస్తూ ఎవరో చెబితే... నన్ను పిలిపించి క్రీస్తుగా ఆడిషన్చేశారు. బాడీ అంతా చెక్చేసి 'నాకు క్రీస్తు దొరికాడు' అన్నారు. కానీ ఆ తర్వాత వేరే సినిమా చేయడంవల్ల ఆ పాత్రచేయలేకపోయాను. 'మరో ప్రపంచం'లో ప్రమీలారాణితో కలిసి నటించాను. పిల్లల్లో మార్పు కోసం ఉద్యమం జరుగుతుంది. ఆ చిత్రంలో దొంగ వేషం వేశాను. ఆ గెటప్లో ఆదుర్తిసుబ్బారావు నన్ను చూసి క్రీస్తుగా చాలాబాగుంటావని ప్రశంసించారు. ఆ తర్వాత 'రారాజు క్రీస్తు'లో అవకాశం వచ్చింది. అప్పటికే 'రౌడీరాణి'లాంటి సినిమాల్లో నటిస్తున్నాను. హీరో అవ్వాలని ఈ రంగంలోకి వచ్చాను. 'సుపుత్రుడు'లో విలన్గా చేశాను. ఇలాంటి పాత్రలు చేస్తున్న నాకు అనుకోకుండా ఏసుక్రీస్తు వేషం వేయాల్సిన అవసరం ఏర్పడింది. పూర్తికావడానికి ఐదేళ్ళుపట్టినా... ఆ తర్వాత ఆదరణ ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిందని'' ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇక ఇప్పుడు ఆయన కరుణామయుడు సినిమా విడుదలై రేపటికి 34 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 'నేను - నా కరుణామయుడు' పుస్తకం రాసి విడుదల చేస్తున్నారు. పుస్తకం చివరి పేజీలో ఇలా పొందుపర్చారు. ''పాపుల్లో మహాపాపి అయిన విజయచందర్ కరుణామయుడు చిత్రంలో ఏసుక్రీస్తుపాత్ర వేయడానికి సాక్షాత్తూ ఆ ఏసుక్రీస్తు ప్రభువే ఎన్నుకొన్నాడు''. అని. మళ్ళీనేను 'నేను నా కరుణామయుడు' పుస్తకాన్ని రాయడానికి ఆయనే కారణం అన్నారు.
ఈ పుస్తకాన్ని 28 భాషల్లో అనువదించబోతున్నాను. వృద్ధాశ్రమాల ఏర్పాటుకు వీటి ద్వారా వచ్చే ఆదాయం ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లో జిల్లాకి 100 ఎకరాల చొప్పున ఒక్కో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. సరైన పని సరైనవాడు చేస్తే.. వెనక ఎంతోమంది ఉంటారంటారు. నా నమ్మకం అదే'' అని చెప్పారు. 'నేను - నా కరుణామయుడు' పుస్తకావిష్కరణ శుక్రవారం జరగనుంది.