Just In
- 24 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 48 min ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 53 min ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 1 hr ago
రొమాన్స్లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- Automobiles
భారత్లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్క్రాస్ విడుదల
- News
అనంత కలెక్టర్ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరంజీవి 150: విజయశాంతితో వివి వినాయక్ సంప్రదింపులు!
హైదరాబాద్: చిరంజీవి సుప్రీమ్ హీరో నుండి మెగాస్టార్ గా ఎదుగుతున్న తరుణంలో కొన్ని భారీ హిట్స్ అందించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి- విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన 'గ్యాంగ్ లీడర్'తో పాటు పలు సినిమాలు అప్పట్లో బాక్సాఫీసు సెన్సేషన్ గా నిలిచాయి. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ విజయశాంతి చిరంజీవితో కలిసి 150వ సినిమాలో నటించబోతోందని తెలుస్తోంది.
Also Read: చిరంజీవి నా కోసం పార్టీ అరేంజ్ చేసారు: విజయశాంతి
దాదాపు 12 సంవత్సరాలుగా విజయశాంతి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్న ఆమెపై దర్శకుడు వివి వినాయక్ దృష్టి పడింది. చిరంజీవి 150వ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర ఆమెతో చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ మేరకు ఇటీవల విజయశాంతిని వివి వినాయక్ టీం కలిసినట్లు సమాచారం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాలో ప్రత్యేక పాత్ర గురించి ఆమెకు వివరించారని, పాత్ర బాగుండటంతో వారి ప్రతిపాదనకు విజయశాంతి కూడా పాజిటివ్ గానే స్పందించారని అంటున్నారు. అయితే విజయశాంతి ఇంకా సైన్ చేయలేదని, రెండ్రోలు ఆలోచించి చెబుతానని చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే విజయశాంతి పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఆమె పాత్ర మాత్రం చాలా ప్రాధాన్యతతో కూడి ఉంటుందని మాత్రం అంటున్నారు. మరో వైపు ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. నయనతారే ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. జులై 18 నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.