Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాహుబలి-3 మీద క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్!
బాహుబలి స్టోరీని ఇప్పటికే పూర్తి చేశాం. మూడో పార్ట్ ఉండటానికి ఆస్కారం లేదు. నేనుగానీ, నా కుమారుడుగానీ దీనిపై ఎలాంటి ఆలోచన చేయలేదు. నేను స్టోరీ కూడా రాయడం లేదు అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
హైదరాబాద్: బాహుబలి మూవీ అభిమానులను కొన్ని రోజులుగా వేధిస్తున్న ప్రశ్నకు క్లారిటీ దొరికింది. బాహుబలి మూవీ పార్ట్-2తోనే ఆగిపోతుందా? లేక భవిష్యత్తులో పార్ట్-3 ఉండే అవకాశం ఉందా? అనే సందేహానికి ఇటీవల ఇంటర్వ్యూలో సరైన సమాధానం ఇవ్వలేక పోయాడు దర్శకుడు రాజమౌళి.
తన తండ్రి విజయేంద్ర ప్రసాద్.... బాహుబలి-3 కథ రాస్తే, అది నాకు నచ్చితే తప్పకుండా తీస్తా అని అన్నారు. ప్రస్తుతానికైతే కథ లేదు, అందుకే నేను పార్ట్-3 తీస్తాననిగానీ, తీయనని గానీ ఇప్పుడే గ్యారంటీ ఇవ్వలేనని చెప్పుకొచ్చారు రాజమౌళి.
అయితే ఈ విషయమై తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.
బాహుబలి పార్ట్-3 సినిమా ఉండదు
బాహుబలి స్టోరీని ఇప్పటికే పూర్తి చేశాం. మూడో పార్ట్ ఉండటానికి ఆస్కారం లేదు. నేనుగానీ, నా కుమారుడుగానీ దీనిపై ఎలాంటి ఆలోచన చేయలేదు. నేను స్టోరీ కూడా రాయడం లేదు అని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
బాహుబలి ప్రపంచం ఇక్కడితో ముగియదు
ఇకపై బాహుబలి సిరీస్ సినిమాలు ఉండవని, అయితే బాహుబలి ప్రపంచం మాత్రం కొనసాగుతుందని విజయేంద్రప్రసాద్ చెప్పారు. బాహుబలిపై కామిక్ సిరీస్, టీవీ సిరీస్ రానున్నాయని విజయేంద్రప్రసాద్ తెలిపారు.
అవే సెట్స్ లో షూటింగ్
భవిష్యత్తులో రాబోయే బాహుబలి కామిక్ సిరీస్, టీవీ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం ఉన్న బాహుబలి సెట్స్లో షూటింగ్ జరుపుకుంటాయని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
వెయ్యికోట్ల బాహుబలి
కాగా... బాహుబలి-2 మూవీ రూ. వెయ్యికోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఇంత భారీ వసూళ్లు సాధించిన తొలి చిత్రం ఇదే.