Don't Miss!
- News
Leader: రూ. 100కే అందరికి బ్లూఫిల్మ్ చూపించిన గొప్ప లీడర్ ఆ మాజీ మంత్రి, అంతు చూస్తా, చాలెంజ్!
- Sports
పాపం సర్ఫరాజ్ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
విశ్వరూపం నిషేధానికి కారణం ఆమె.. జయలలితపై కమల్ ఫైర్
గతంలో విశ్వరూపం చిత్రంపై నిషేధం విధించిన తమిళనాడు ప్రభుత్వంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ మరోసారి నిప్పులు చెరిగారు. విశ్వరూపం చిత్రాన్ని అడ్డుకొన్నద ఎవరో నాకు తెలుసు అని ఇటీవల తమిళ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత జే జయలలితపై పరోక్షంగా తీవ్రంగా విమర్శలు చేశారు.
నాలుగు సంవత్సరాల క్రితం తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ కేసు నమోదు చేసింది. జయ ప్రభుత్వం తీరు వల్ల నాకు రూ.55 కోట్ల నష్టం వాటిల్లింది. విశ్వరూపంపై నిషేధానికి కారణం కేవలం కొన్ని ముస్లిం సంస్థలే కాదు. కొందరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన నేతలే నాకు సహాయం చేసి కష్టాల నుంచి బయటపడేశారు. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ నేతనే విశ్వరూపం వివాదానికి కారణం అని జే జయలలితపై పరోక్షంగా ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం సుభాష్ నాయుడు అనే చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. షూటింగ్లో కాలికి గాయం కావడంతో సినిమా నిర్మాణం వాయిదా పడింది. మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, సౌరభ్ శుక్లా నటిస్తున్నారు.