Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తొలిసారి మహేష్... చూడకపోతే చూసేయండి...అదిరిందంటే(వీడియో)
హైదరాబాద్ : మహేష్ ఇంతవరకూ ఎప్పుడూ టీవిలో టాక్ షోలో పాల్గొన్నది లేదు. అయితే తొలిసారిగా ఆయన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే టీవి షోకు హాజరవుతున్నారు. జీ తెలుగులో టాప్ షో గా కొనసాగుతున్న ఈ షోకు ఆయన వస్తున్న విషయాన్ని ఆ షో హోస్ట్ ప్రదీప్ తన ఫేస్ బుక్ ద్వారా తెలియచేసారు.
ఈ సెన్సేషన్ ఎపిసోడ్ ఈ నెల 22 వ తేదీ, ఆదివారం ప్రసారవుతుంది. ప్రస్తుతం కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 ప్రతీ ఆదివారం జీ తెలుగులో వస్తోంది. ఇప్పటికే ఈ సీజన్ లో రకుల్ ప్రీతి సింగ్, సాయి ధరమ్ తేజ వచ్చి హంగామా చేసారు.
ఇక ఇప్పుడు మహేష్ బాబు ఈ షోకు రావటంతో ఛానెల్ వాళ్ల ఆనందం మామూలుగా లేదు. శ్రీమంతుడు నుంచి మీడియాకు పూర్తి స్దాయిలో టచ్ లో కి వస్తున్నారు మహేష్. ఇప్పుడున్న పరిస్దితుల్లో మీడియాకు టచ్ లో లేకపోతే ప్రమోషన్ వేగం తగ్గుతోందని ఆయన గమనించారు. అలాగే ఇది ఓ రకంగా ఫ్రీ పబ్లిసిటీ కూడాను.
ఇక బ్రహ్మోత్సవం చిత్రం ప్రమోషన్ లో భాగంగా జీ తెలుగుకు వచ్చిన ఆయన తన పర్శనల్ విషయాలతో పాటు, తన సినిమాల గురించి కూడా వివరించారు. ఇదిగో ఈ ప్రోమోను ఇక్కడ మీరు చూడవచ్చు.
మహేష్ మాట్లాడుతూ...దాదాపు 28 మంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం ఫస్ట్టైమ్. చాలా కొత్త అనుభూతినిచ్చింది. చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకున్నాను. శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఈ చిత్రం కూడా మన నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. ఇందులో మంచి లవ్ ట్రాక్ కూడా ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ వాల్యూస్ని తెలిపే చిత్రమిది.
మనం మర్చిపోతున్న చిన్న చిన్న విలువలను ఈ సినిమా గుర్తు చేస్తుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తమ ఫ్యామిలీని గుర్తు చేసుకుంటాడు. సినిమా చాలా బాగా వచ్చింది. క్వాలిటీ పరంగా ఏమాత్రం రాజీపడకుండా నిర్మాత పివిపి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆయన కంటెంట్ను నమ్మి చేసిన చిత్రమిది. ఓవర్సీస్లో ప్రీమియర్ షో ఇక్కడ విడుదల రోజుకి ముందే ఉంటుంది. అలా విడుదలైనంత మాత్రం ఇక్కడ ప్రభావం పడడమనేది ఏం ఉండదు. సినిమా బాగుంటే ఎప్పుడైనా చూస్తారు.