Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ బిడ్డకు తల్లి హీరోయిన్ కాజలే.... రానా ఫన్నీ ట్వీట్!
తాజాగా రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్ విడుదలైన సందర్భంగా ఓ అభిమానిని రానాని ఓ ప్రశ్న వేశారు. ‘బాహుబలి 2లో మీ భార్య ఎవరు? మీరీ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే’
హైదరాబాద్: బాహుబలి-2 మూవీ విడుదలై దాదాపు నెల రోజులైనా చాలా మంది అభిమానులు ఆ మత్తు నుండి బయటకు రాలేదు. ఈ సినిమాలో సమాధానం దొకరని ప్రశ్నలకు జవాబుకోసం అన్వేషిస్తూనే ఉన్నారు.
'బాహుబలి 2' చిత్రం విడుదలైన తర్వాత.... భల్లాలదేవుడి భార్య ఎవరు? తనకొడుకైన భద్రకు ఎవరి ద్వారా జన్మనిచ్చాడు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయమై కొన్ని రోజుల క్రితం రానాను ప్రశ్నిస్తే... సరోగసి విధానంతో 'భద్ర' పుట్టాడంటూ ఆ మధ్య సరదాగా బదులిచ్చారు.
ఆ బిడ్డకు తల్లి కాజల్ అంటూ..
తాజాగా రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి' టీజర్ విడుదలైన సందర్భంగా ఓ అభిమానిని రానాని ఓ ప్రశ్న వేశారు. ‘బాహుబలి 2లో భల్లాలదేవుడి భార్య ఎవరు? మీరు ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే' అని రానాకు ట్వీట్ చేశాడు. దీనికి రానా.. కాజల్ అంటూ సమాధానమిచ్చారు.
|
కాజల్ కూడా...
ఈ ట్వీట్ని కాజల్ అగర్వాల్ రీట్వీట్ చేస్తూ.. ‘ఇక నేనేం చెప్తాను. మాది జన్మ జన్మల అనుబంధం' అంటూ కామెంట్ చేయడం గమనార్హం. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో జోడీగా నటిస్తున్నరానా, కాజల్ చేసిన ఈ ట్వీట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
నేనే రాజు నేనే మంత్రి
తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి' చిత్రం టీజర్ ప్రముఖ నిర్మాత, రానా తాతయ్య డి. రామానాయుడు జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు.
పొలిటికల్ థ్రిల్లర్
సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరి నిర్మాతలు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో రాణా సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది.
రానా కెరీర్లో మైలు రాయి
సురేష్ బాబు మాట్లాడుతూ.. "రానా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం "నేనే రాజు నేనే మంత్రి" అన్నారు. రానా, కాజల్, అశితోష్ రాణా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని, జెపీ, రఘు కారుమంచి, బిత్తిరి సత్తి, ప్రభాస్ శీను, శివాజీ రాజా, జోష్ రవి, నవీన్ నేలి, ఫన్ బకెట్ మహేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.