Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మగధీర రీలీజైన రోజే : ‘ఎవడు’ జులై 31న
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిర జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం జులై 31న విడుదల చేసేందుకు డేట్ ఫైనల్ అయింది. అంతకు ముందు జులై 25 అనుకున్నప్పటికీ సెంటిమెంటు కలిసొస్తుందని జులై 31ని ఫైనల్ చేసినట్లు స్పష్టం అవుతోంది.
చరణ్
గత
సినిమా
మగధీర
జులై
31,
2009లో
విడుదలై
తెలుగు
సినిమా
రికార్డులను
తిరగరాసింది.
మెగా
ఫ్యామిలీ
నుంచి
ఇప్పటి
వరుక
వచ్చిన
భారీ
బ్లాక్
బస్టర్స్...
తొలిప్రేమ(24
జులై,
1998),
ఇంద్ర(జులై
25,
2002),
మగధీర(31
జులై,
2009)లాంటి
సినిమాలన్నీ
జులై
చివరి
వారంలో
విడుదలైనవే
కావడం
గమనార్హం.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు.
మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.