twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర రీలీజైన రోజే : ‘ఎవడు’ జులై 31న

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిర జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం జులై 31న విడుదల చేసేందుకు డేట్ ఫైనల్ అయింది. అంతకు ముందు జులై 25 అనుకున్నప్పటికీ సెంటిమెంటు కలిసొస్తుందని జులై 31ని ఫైనల్ చేసినట్లు స్పష్టం అవుతోంది.

    చరణ్ గత సినిమా మగధీర జులై 31, 2009లో విడుదలై తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరుక వచ్చిన భారీ బ్లాక్ బస్టర్స్... తొలిప్రేమ(24 జులై, 1998), ఇంద్ర(జులై 25, 2002), మగధీర(31 జులై, 2009)లాంటి సినిమాలన్నీ జులై చివరి వారంలో విడుదలైనవే కావడం గమనార్హం.

    వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు.

    మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    English summary
    Ram Charan’s ‘Yevadu’ has been shifted to July 31st. The movie was originally scheduled for a release on July 25th. ‘Yevadu’ has Shruti Haasan and Amy Jackson as the female leads. Vamshi Paidipally is the director of this movie and Dil Raju is the producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X