Don't Miss!
- Sports
U19 Women’s T20 World Cup Final: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లండ్దే బ్యాటింగ్!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
బ్యాంకాక్ వెళుతున్న వెంకీ, వరుణ్ తేజ్!
టాలీవుడ్ మల్టీస్టార్ చిత్రాల సందడి ఎక్కువ కాబోతోంది. వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలకు బ్రాండ్ గా మారుతున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తుంన్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. ఈ చిత్రానికి వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకుడు. తాజగా ఈ చిత్రం హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో చిత్ర యూనిట్ కీలకమైన షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు.
క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొనివుంది. బ్యాంకాక్ షెడ్యూల్ 20 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి చిత్రాలలో వినోదం ప్రధానాంశంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని కూడా అదేవిధంగా తెరకెక్కిస్తూనే ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యేలా చూస్తున్నారు.

వెంకటేష్ సరసన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.