Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగాస్టార్ గుండు వెనుక రహస్యం ఇదే... కెరీర్లో తొలిసారి అలాంటి పాత్రలో చిరు!
మెగాస్టార్ చిరంజీవి... ఆరవై ఏళ్ల వయసులో కూడా పదహారేళ్ల కుర్రాడిలా ఆడి పాడగల నటుడు. పేరుకు సీనియర్ హీరోనే అయినా... నేటి తరం వాళ్లకు సరైన పోటీని ఇస్తున్నారాయన. సినిమాలకు వచ్చిన గ్యాప్ను మరిపించేందుకు ఆయన వరుస సినిమాలతో సందడి చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సరికొత్త ప్రయోగాలకూ శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గుండుతో దర్శనమించారు. దీంతో ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన గుండు వెనుక రహస్యం తెలిసిపోయింది. ఆ వివరాలు మీకోసం.!
Recommended Video
కథ అడ్డం తిరిగింది.. చరణ్ రోల్ ఖాయం
సైరా తర్వాత ఆచార్య సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సంవత్సరమే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడిపోయింది. దీంతో మెగాస్టార్ ఫ్యూచర్ ప్రాజెక్టులు సైతం మరింత వెనక్కి వెళ్లిపోయాయి. ఇక, ఆచార్యలో రామ్ చరణ్ నటించడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. షూటింగ్ ప్రారంభమైతే అతడి పార్ట్నే చిత్రీకరిస్తారని సమాచారం.
చిరంజీవి లైన్ చాలా పెద్దదిగానే ఉందిగా
ప్రస్తుతం ‘ఆచార్య'లో నటిస్తోన్న చిరంజీవి.. దీని తర్వాత చేయబోయే చిత్రాల విషయంలో పకడ్బందీగా ఉన్నారు. ఇందుకోసం లాక్డౌన్ సమయంలోనే కొందరు దర్శకులు చెప్పిన కథలను విన్నారు. అందులో సుజిత్, బాబీ, మెహర్ రమేశ్లను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. అయితే, ఈ జాబితా నుంచి ‘సాహో' డైరెక్టర్ నిష్క్రమించినట్లు ప్రచారం జరుగుతోంది.
రెండు రీమేక్లు.. అది మాత్రం కొత్త కథ
‘ఆచార్య' తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాల్లో రెండు రీమేక్లు ఉన్నాయి. అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్' కాగా, రెండోది తమిళంలో బంపర్ హిట్ అయిన ‘వేదాళం'. ఇక, బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తీసే సినిమా మాత్రం కొత్త కథతో రాబోతుందని తెలుస్తోంది. ‘ఆచార్య' తర్వాత వేదాళం రీమేక్ పట్టాలెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
గుండుతో చిరంజీవి... ఆ మూవీ కోసమే
తాజాగా చిరంజీవి గుండుతో కనిపించి షాకిచ్చారు. ఈ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కొద్ది సమయంలోనే బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో చేయబోయే ఓ సినిమా కోసం ట్రయల్ ఫొటో షూట్ చేశారని, అందులో భాగమే ఈ ఫొటో అని కొందరు సినీ ప్రముఖులు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం.. ఇది వేదాళం రీమేక్ కోసమట.
కెరీర్లో తొలిసారి అలాంటి పాత్రలో చిరు.!
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... మాతృకలో అజిత్ పొట్టి జుట్టుతో కనిపించాడు. కాబట్టి రీమేక్లోనూ చిరు అలాంటి గెటప్తో కనిపించాల్సి ఉంటుందట. అయితే, దీనికి భిన్నంగా ఆయన గుండుతో ప్రయోగం చేయబోతున్నారని తెలుస్తోంది. తాజాగా వదిలిన ఫొటో అందులో భాగమేనని సమాచారం.