Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పోలీసులతో త్రిష వాగ్వివాదం
చెన్నై : చెన్నై విమానాశ్రయంలో నటి త్రిష, భద్రతాధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వెళ్లే నిమిత్తం త్రిష ఉదయం 8 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. పోలీసులకు ఆమెను గుర్తింపు కార్డు చూపమని అడిగారు. ఈ విషయంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికి పరిస్థితి సద్దుమణగడంతో ఆమె హైదరాబాద్ విమానమెక్కారు.
''చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూడాలని ఎవరికీ అనిపించదు. నేనూ అంతే. చేసిన పాత్రే మళ్లీ చేయడానికి సిద్ధంగా లేను. అందుకే చాలా సినిమాల్ని వదులుకోవలసి వచ్చింది'' అంటోంది త్రిష. తెలుగులో సినిమాలెందుకు తగ్గాయి? అని అడిగితే పైవిధంగా స్పందించింది.
''ప్రేక్షకులు రోజుకో కొత్త రుచిని కోరుకొంటున్నారు. అందుకు తగినట్టుగా సిద్ధమైతేనే వారికి నచ్చుతుంది. కొత్త పాత్రలు వచ్చినప్పుడు నటించడానికి మాక్కూడా ఎంతో హుషారుగా ఉంటుంది. 'ఇలాంటి పాత్ర ఇంతకు ముందు చేసేశాం' అనిపించినప్పుడు ఎలాంటి ఆసక్తి చూపించలేం. నన్ను నేను కాపీ కొట్టుకోవడం ఏం బాగుంటుంది?'' అంటోంది.
''కహానీ', 'ద డర్టీ పిక్చర్' లాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ప్రయోగాలు చేయొచ్చు. కానీ మన పరిధి, పరిమితులు దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే అభాసుపాలవుతాం'' అని ముక్తాయించింది.