నయనతారకు తెలియకుండా చేసుంటేనే తప్పు
అలాగే నయనతార, తన పై వస్తున్న వదంతులు గురించి చెప్తూ... సినీ పరిశ్రమలో నాకు చాలామంది స్నేహితులుంటారు. అందరితోనూ చాలా సన్నిహితంగా ఉంటా. పాఠశాల, కళాశాల, సినీ పరిశ్రమకు చెందినవాళ్లే అందరూ. వాళ్లతో ఉంటేనే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అయినా వాటిని పట్టించుకోను అన్నారు.
'రాజా రాణి' హీరోయిన్స్ గురించి చెప్తూ... నయనతార, నశ్రియలతో కలసి నటించడం కొత్త అనుభూతి. వీరిలో నయన్ చాలా సీనియర్. 'బాస్ ఎన్గిర భాస్కరన్'లో నాతో జోడీగా కనిపించింది. ఇక నశ్రియా కొత్తమ్మాయి... కానీ అల్లరల్లరిగా చాలా వేగంగా ఉంటుంది. నయన్ చాలా నిదానంగా ఉంటుంది. నశ్రియాలకు నటించేందుకు సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో తమిళం కూడా నేర్పాను అన్నారు.
విశాల్ తో స్నేహం గురించి చెప్తూ... నేను, విశాల్ ఈ రంగంలోకి వచ్చాకే మిత్రులం కాదు. అంతకుముందే నాకు తెలుసు. ఇద్దరం ఒకే పాఠశాలలో చదువుకున్నాం. అప్పట్లో వాళ్ల అన్న నటించేవారు. అసలు మేం ఇలా సినిమారంగంలోకి వస్తామని వూహించలేదు. తను తొలుత నటించడానికి వచ్చాడు. ఆ తర్వాత నేను అడుగుపెట్టా. అయితే చాలాకాలంగా ఇద్దరం కలసి నటించాలని అనుకున్నాం. అలా 'అవన్ ఇవన్'తో ఆ కోరిక నెరవేరింది అన్నారు.
'అరిందుం అరియామలుం'లో రౌడీ పాత్రతో తెరపై అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు ఆర్య. అమ్మాయిల మనసు దోచుకోవడంతోపాటు అందర్నీ ఆకట్టుకుంటున్నాడీ 'బాస్..'. తాజాగా 'రాజా రాణి'లో నయన్, నశ్రియాలతో ఆడిపాడాడు. ఈ చిత్రంతో అభిమానుల్లో మరింతమంది అమ్మాయిలు చేరారనే చెప్పాలి. సరికొత్త ప్రేమ కథా చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.పెళ్లి విషయం ప్రస్తావిస్తే.. ఇప్పుడేం అవసరముందని చెబుతున్నాడు. ఏదేమైనా ప్రేమించి.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం ఖాయమంటున్నాడు.


Click it and Unblock the Notifications












