Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగచైతన్యతో కాదు..కార్తీతో
చెన్నై: మణిరత్నం దర్శకత్వంలో చిత్రం గురించి గత కొంత కాలంగా తెలుగు,తమిళ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆ మధ్యన నాగచైతన్య, రానా లతో ఓ ప్రాజెక్టు ప్రారంబిస్తారని వినిపించింది. అయితే ఇప్పుడా ప్లాన్ మారిందని, తమిళ హీరో కార్తీ సీన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
మొదట నాని,కార్తీలతో ఈ చిత్రం అనుకున్నారు. అయితే అది మెటీరియలైజ్ కాక నాగచైతన్య, రానా అనుకున్నారు. అయితే అదీ ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు కార్తి ని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. మరి వేరే హీరోగా ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.
త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. బహుసా జూన్ నెలాఖరకు ఈ ప్రాజెక్టు మెటీరయలైజ్ కావచ్చు. ప్రేమమ్ లో చేసిన మళయాళి సాయి పల్లవి ని హీరోయిన్ గా కార్తీ సరసన మణి రత్నం ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సాయి పల్లవి ...చెన్నైలోని మణిరత్నం ఆఫీస్ మద్రాస్ టాకీస్ వచ్చి ఫొటో షూట్ లో పాల్గొందని సమాచారం. ఆమె ఫొటో షూట్ తో మణిరత్నం చాలా సంతృప్తి చెందినట్లు చెన్నై సినీ వర్గాలు చెప్తున్నారు. మొత్తానికి నాగచైతన్య ప్లేస్ లోకి కార్తి వచ్చాడన్నమాట.