Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
సబ్ కలెక్టర్ సాక్షిగా... ఆ మూవీ వద్దు, ఈ సినిమానే చూస్తామంటూ!
తమిళంలో సూపర్ స్టార్ ఎవరు అంటే రజనీకాంత్ అని ఎవరైనా తడుముకోకుండా చెబుతారు. అయితే రజనీ తర్వాత ఆ స్థానం ఎవరికి దక్కుతుంది అంటే మెజారిటీ తమిళ ఆడియన్స్ విజయ్ పేరు చెబుతున్నారు. వరుస విజయాలతో విజయ్ తమిళ యువతలో, పిల్లల్లో రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటూ మాస్ హీరోగా అవతరిస్తున్నారు.
కేవలం తమిళనాడులో మాత్రమే కాదు... కేరళలోనూ అతడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా కేరళ వాయనాడు సబ్ కలెక్టర్ ఉమేష్ కేశవన్ గిరిజన బాలికలతో సర్కార్ సినిమా చూశారు. అనంతరం తన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నారు.
‘సర్కార్' బదులు 2.0 తీసుకెళ్లాలనుకున్నప్పటికీ...
ఇక్కడి మహిళా సమాఖ్య వసతి గృహానికి చెందిన పిల్లలకు సినిమా చూపించాలని ఉమేష్ కేశవన్ భావించారు. వీరికి ‘సర్కార్' సినిమా చూపించాలని భావించినప్పటికీ అందులో రాజకీయ పరమైన అంశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదన ఉండటంతో... వారిని త్వరలో విడుదల కాబోయే రజనీకాంత్ 3డి మూవీ 2.0కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.
వారి రియాక్షన్ చూసి సబ్ కలెక్ట్ ఆశ్చర్యం
అయితే తన నిర్ణయం బాలికలకు చెప్పగానే వారి నుంచి వచ్చిన రియాక్షన్ చూసి సబ్ కలెక్టర్ ఆశ్చర్యపోయారు. వారంతా తమకు ‘సర్కార్' సినిమా చూడాలని ఉందని, ఆ సినిమాకే తీసుకెళ్లాలని పట్టుబట్టారట. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్ బుక్ పోస్టులో వెల్లడించారు.
‘సర్కార్' సౌతిండియా రికార్డ్
విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 220 కోట్లకుపైగా వసూలు చేసి 2018 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాగా నిలిచింది.
రజనీకాంత్ 2.0
రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘2.0'. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూ. 600 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.