Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సీఎం జోక్యంతో స్టార్ హీరో వివాదానికి తెర
రాజకీయాంశాలకు చెందిన కా ర్యక్రమాల్లో పాల్గొనాలని నటీనటులను బలవంతం చేయడం సరికాదని 6న చెన్నైలో జరిగిన ముఖ్యమంత్రి కరుణానిధి సన్మాన కార్యక్రమంలో ఆవేశంగా ప్రసంగించిన అజిత్ వ్యా ఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ వివాదం పెరిగి పెద్దదవటంతో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి స్వయంగా కలగచేసుకుని ఈ వ్యవహారానికి తెరదించాల్సి వచ్చింది. ఈ వివాదంతో తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య దూరం పెరగడమే కాకుండా, అజిత్పై చర్యలు తీసుకోవాలనే వరకు ఈ వ్యవహారం సాగడంతో తమిళ సినీ పరిశ్రమ రెండు విడిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో తాను సిని పరిశ్రమకు దూరం అవుతానని ఇకపై రేసులపై దృష్టి సారిస్తానంటూ అజిత్ ప్రకటించా రు. దీనిపై రజనీకాంత్ కూడా రెండు విధాలుగా మాట్లాడి, ఆపై సైలెంట్ అవటం కూడా విమర్శలకు దారితీసింది.
రజనీ కుమార్తె నిశ్చితార్థం మరుసటిరోజు రజనీకాంత్, అజిత్లు ఒకరి తరువాత ఒకరు ముఖ్యమంత్రిని కలుసుకోవడం తమిళ పరిశ్రమలో సంచలనమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కరుణానిధి తాజాగా మురసొలి పత్రికకు ఇచ్చిన ప్రకటనలో అజిత్ నిజాయితీని, డేరింగ్ని మెచ్చుకున్నారు. అజిత్ వ్యాఖ్యలు పెద్ద దు మారం రేపాయని, ఇందుకు పరోక్షం గా మీడియా కూడా కారణమని, పరిశ్రమలోని పలువురు ఈ విషయాన్ని మరీ పెద్దదిగా చేసి అనవసర రాద్దాం తం చేశారని వ్యాఖ్యానించారు. పరిశ్రమలో అందరూ ఐకమత్యం, క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. సన్మా న కార్యక్రమంలో తను చేసిన వ్యాఖ్యలపై అజిత్ వివరణ ఇచ్చారని, అవి తనకు వ్యతిరేకంగా కాదని స్పష్టం చే శారు.ఈ అంశాన్ని పలువురు తమకు అనుకూలంగా మలచుకున్నారని ఇది ఇక్కడితో ముగిసిపోవాలని అజిత్ కోరారని వివరించారు.