Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వడివేలుపై పోలీసులకు నిర్మాతల ఫిర్యాదు.. పీకల్లోతు కష్టాల్లో కమెడియన్
Recommended Video
ప్రముఖ హాస్యనటుడు వడివేలు సినీ కెరీర్లో హింసించే 23వ రాజు పులకేసి మైలురాయిగా నిలిచింది. ఆ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం తర్వాత హింసించే 24వ పులకేసి రూపొందించింది. ఈ చిత్రం షూటింగ్ విషయంలో తమను ఇబ్బందికి గురిచేశాడని నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది
24వ పులకేసి, వడివేలు వివాదం
గతేడాది 23వ రాజు పులకేసి చిత్రానికి సీక్వెల్గా హింసించే 24వ రాజు పులకేసి ప్రారంభించారు. ఆ చిత్రానికి కూడా దర్శకుడు శంకర్ నిర్మాతగా వ్యవహరించారు. వడివేలు సహకరించకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది.
సహకరించని హాస్యనటుడు వడివేలు
హింసించే 24వ రాజు పులకేసి చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని వడివేలును కోరారు. పలుమార్లు కోరిన పిదప కూడా ఫలితం లేకపోయింది. ఆ నేపథ్యంలో వడివేలుపై చర్యలు తీసుకోవడానికి నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వడివేలుపై ఫిర్యాదు చేసినా..
పోలీసులను సంప్రదించడానికి ముందు తమిళనాడు నిర్మాతల మండలిలో పులకేసి నిర్మాతలు ఫిర్యాదు చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా గానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం.
వివాదానికి కారణం ఇదే
ఈ చిత్రంలో వడివేలుకు పనిచేసే స్టైలిష్ట్ విషయంపై వివాదం నెలకొన్నది. తనకు నచ్చిన స్టైలిస్ట్ను ఇవ్వాలని, లేదా తెచ్చుకొంటానని సూచించడంతో నిర్మాతలు నిరాకరించారు. దాంతో నిర్మాతలకు, వడివేలుకు మధ్య రిలేషన్లు చెడిపోయాయి.
తీవ్ర నష్టాల్లో నిర్మాతలు
వడివేలు సహకరించకపోవడం వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. నిర్మాతలు తీవ్రంగా నష్టాల పాలయ్యారు. దాంతో చేసేది ఏమీలేక వడివేలుపై చర్యలకు పూనుకొన్నట్టు సమాచారం.