Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ విషాద సమయంలో పుట్టినరోజు వేడుకలొద్దు: ఫ్యాన్స్కి రజనీకాంత్ లేఖ
ఈ సారి మాత్రం రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరిగే అవకాశం లేదు. రజనీకాంత్ ఈవేడుకలను రద్దు చేసుకున్నారు. అభిమానులకు కూడా ఈ మేరకు లేఖ రాసారు.
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళనాడులో పండగవాతావరణం కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 12 వచ్చిదంటే ఆయన పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఈ సారి మాత్రం రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరిగే అవకాశం లేదు. రజనీకాంత్ ఈవేడుకలను రద్దు చేసుకున్నారు. అభిమానులకు కూడా ఈ మేరకు లేఖ రాసారు. తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని, ఈనెల 12న బ్యానర్లు, పోస్టర్లు పెట్టవద్దని అభిమానులను కోరారు.
కారణం జయలలిత
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబరు 6న కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు.
జయ పార్థీవదేహాన్ని చూసి రజినీ కంటతడి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని చూసి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. రాజాజీ హాల్లోని ఆమె భౌతికకాయానికి మంగళవారం ఉదయం రజినీకాంత్ తన కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. జయను చూసిన రజినీకాంత్ బావోద్వేగాన్ని అపుకోలేక కంటతడి పెట్టారు.
సిగరెట్ వెలిగించి జయలలితను ఇరికించిన రజనీకాంత్... అప్పట్లో సంచలనం!
కేవలం తమిళనాడు మాత్రమే కాదు, ఎంటైర్ నేషన్ జయలలిత మరణంతో శోక సముద్రంలో మునిగిపోయింది. మా గౌరవ ముఖ్యమంత్రి ఆత్మకు శాంతికలగాలి అంటూ రజనీకాంత్ ట్వీట్ చేసారు. అయితే గతంలో వీరి మధ్య పరిస్థితి మరోలా ఉండేది. ఓ సారి జయలలితకు, రజనీకాంత్ మధ్య జరిగిన సంఘటన హాట్ టాపిక్ అయింది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రోబో-2... తెరపైకి మన మెగాస్టార్ పేరు, నిజమా?
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘2.0'. ఇంతకు ముందు వచ్చిన ‘రోబో' చిత్రానికి ఇది సీక్వెల్. రూ. 360 కోట్ల పై చిలుకు బడ్జెట్ హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.