Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విడాకుల కోసం కోర్టుకు రజనీకాంత్ కూతురు.. పొలిటికల్ ఎంట్రీకి ముందు..
సూపర్స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య తన భర్త అశ్విన్తో విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. గత కొద్దికాలంగా సౌందర్య దంపతుల మధ్య విభేదాల నెలకొన్న సంగతి తెలిసిందే.
సూపర్స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య తన భర్త అశ్విన్తో విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. గత కొద్దికాలంగా సౌందర్య దంపతుల మధ్య విభేదాల నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం చెన్నైలోని ఓ ఫ్యామిలీ కోర్టుకు సౌందర్య హాజరయ్యారు. అశ్విన్తో సౌందర్య వివాహం 2010లో జరిగింది. సౌందర్య, అశ్విన్రే వేద్ అనే కుమారుడు ఉన్నాడు. వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో గతేడాది విడిపోవాలని వారు నిర్ణయించుకున్నారు. రజనీ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో కుటుంబంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంపై అభిమానుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సౌందర్య, అశ్విన్ దంపతుల విడాకుల కేసు విచారణను కుటుంబ న్యాయస్థానం శుక్రవారం విచారించింది. తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించినా దంపతులిద్దరూ ఉమ్మడి అంగీకారంతో విడిపోతున్నామని కోర్టుకు పేర్కొన్నట్టు తెలిసింది. వచ్చే విచారణలోపు దంపతులిద్దరూ విడిపోవడానికి గల కారణాలు సవివరంగా తెలుపుతూ, ఉమ్మడి అంగీకారంతో కూడిన ఓ మోమోను ఇద్దరు సమర్పించాలని కోర్టు సూచించింది. దంపతులిద్దరితో సంప్రదింపుల అనంతరం వారి మెమోతో సంతృప్తి చెందితే చట్టబద్ధంగా విడిపోయేందుకు కోర్టు విడాకులు మంజూరు చేయనున్నది. ఈ ఉమ్మడి అంగీకార పత్రంలో భరణం వివరాలు, పిల్లాడి సంరక్షణ బాధ్యతలు తదితర అంశాలు ఉండే అవకాశం ఉంది.