Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆయన సీఎం అయ్యేవరకు నటించాడు.. నన్ను ట్రాప్లో పడేయలేరు.. రజినీ కామెంట్స్
సూపర్స్టార్ రజినీకాంత్ను తెరపై ఆరాధ్య దైవంగా కొలిచేవారు కోకొల్లలు. భాషా, ప్రాంతం ఇలా వేటితో సంబంధం లేకుండా రజినీని ప్రేమించే వారున్నారు. సినిమాల్లో తిరుగులేని ఇమేజ్ను సొంతం చేసుకుని.. కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుని ఇండియన్ సూపర్స్టార్గా ఎదిగాడు. వయసు ఆరుపదులు దాటినా.. యువ హీరోల కంటే వేగంగా సినిమాలను పూర్తి చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. వరుసబెట్టి ప్రాజెక్ట్లను ఓకే చేస్తూ.. బిజిబిజీగా ఉన్నాడు.
రాజకీయాల్లోకి ఎంట్రీ..
జయలలిత మరణం తరువాత ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడానికి రజినీ కాంత్, కమల్ హాసన్ లాంటి వారు పొలిటికల్ జర్నీని ప్రారంభించారు. అయితే రజినీ మాత్రం కాస్త నెమ్మదిగా అడుగులు వేస్తూ.. అభిమానులను కలవర పెడుతున్నాడు. అసలు తమ నాయకుడు ఎప్పుడు వస్తాడు.. కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తాడు అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
లోకసభ ఎన్నికలకు దూరం..
రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికలకు రజినీ దూరంగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని చెప్పి సైలెంట్ అయ్యారు. కానీ కమల్ హాసన్ మాత్రం మొండిగా దూకి ముందుకు వెళ్లారు. అయితే అనుకుంతగా సక్సెస్ కాకపోయినా ఎటువంటి నిరాశకు లోనవ్వలేదు.
బీజేపీతో స్నేహబందం..
రజినీకాంత్ బీజేపీలో చేరతారని, బీజేపీకి మద్దతిస్తారని ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి తగ్గట్టే కేంద్ర మంత్రులు, రజినీతో భేటీ అవ్వడం జరుగుతోంది. దీంతో ఆ వార్తలు మరింత ఊపందుకుంటున్నాయి. అయితే వాటన్నంటిని ఖండిస్తూ రజినీ కాంత్ సెన్సేషనల్ కామెంట్సే చేశారు.
కాషాయాన్ని పులుమలేరు..
తనకు కాషాయ రంగును పులుమాలనుకుంటున్నారు.. తిరువళ్లువార్ను కూడా అలాగే చేద్దామని ప్రయత్నించారు కానీ వారి పప్పులేమీ ఉడకలేదు.. నేను కూడా అంతే వారి ట్రాప్లో పడను.. అంటూ ఆ రూమర్లకు చెక్ పెట్టేశాడు.
సీఎం అయ్యేవరకు నటించాడు..
ఎంజీఆర్ సీఎం అయ్యే వరకు నటిస్తూనే ఉన్నాడు.. రాజకీయ పార్టీని ప్రకటించి.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేవరకు నటిస్తూనే ఉంటానని కుండబద్దలు కొట్టేశాడు. రజినీ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రం చేస్తుండగా.. శివ డైరెక్షన్లో మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.