Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నిషేధంపై నిరాహారదీక్ష చేసాడు
చెన్నై : జల్లికట్టు తమిళుల పౌరుషానికి, సంస్కృతి, సంప్రదాయాలకు తార్కాణమని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, ఎమ్మెల్యే, నటుడు శరత్కుమార్ తెలిపారు. జల్లికట్టుపై అత్యున్నత న్యాయస్థానం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జల్లికట్టు, ఎద్దులబండి పోటీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ మదురైలో శరత్కుమార్ దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలతోపాటు వందలాది మంది తమిళులు, జల్లికట్టు ప్రియులు పాల్గొన్నారు. శరత్ కుమార్ తెలుగులో అప్పటి గ్యాంగ్ లీడర్ నుంచి మొన్న వచ్చిన కాంచన చిత్రం దాకా పలు చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు.
నిరాహారదీక్షను ప్రారంభించిన అనంతరం శరత్కుమార్ మాట్లాడుతూ.. తమ తాత కారైక్కుడి సమీపంలోని తలక్కావూరులో ఓ జల్లికట్టు ఎద్దును పెంచేవారని తెలిపారు. దాన్ని 'పంచ కల్యాణి' అని పిలిచేవాళ్లమని, ఎలాంటి పోటీలోనైనా గెలుపొందడమే తన నైజంగా ఉండదేని చెప్పారు. ఆ ఎద్దు మృతిచెందినా.. ఇప్పటికి దానికి పూజలు చేస్తున్నామని అన్నారు. జల్లికట్లు కోసం ఢిల్లీకి వెళ్లయినా పోరాడుతామని ఆయన అన్నారు.
తమిళుల సంప్రదాయంతో అనుబంధమున్నవి జల్లికట్టు, ఎద్దలబండి పోటీలని చెప్పారు. తమిళగడ్డ ప్రత్యేకతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. నిషేధం విధించేంత స్థాయిలో ఇందులో ఎలాంటి నేరం లేదని, దీనిపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు వెంటనే ఎత్తివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిషేధం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.