Just In
- 34 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 54 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 1 hr ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 1 hr ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
Don't Miss!
- Sports
మహ్మద్ సిరాజ్కు నాతో చీవాట్లు తినడం ఇష్టం: టీమిండియా బౌలింగ్ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- News
జగ్గంపేటలో ఘోర ప్రమాదం .. మంటల్లో ఇద్దరు సజీవ దహనం , ముగ్గురికి గాయాలు
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షెల్టర్ కావాలంటూ హీరో సిద్దార్ద రిక్వెస్ట్
చెన్నై: తన క్రూ ఫ్యామిలీస్ షిప్ట్ అవటానికి అపార్టమెంట్స్ వెతుకుతున్నాం అంటున్నారు సిద్దార్ద. చాలా మంది తన ఆఫీస్ లోనూ, ఇంటి వద్ద చాలా మంది షెల్టర్ కోసం ఉన్నారని, ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసి ఫ్లాట్ ఉంటే చెప్పమని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసారు సిద్దార్ద.
Looking for apartments to shift families of my crew. Lots of people in my office and home for shelter. Please share information about flats.
— Siddharth (@Actor_Siddharth) December 1, 2015
కొద్ది రోజుల క్రితం... సిద్దార్ద నేషనల్ మీడియాపై విరుచుకు పడ్డారు. తమ తమిళనాడులోని చెన్నై తదితర ప్రాంతాల్లో వరదలు ప్రజలను ముంచెత్తుతుంటే.. జాతీయ మీడియా ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఈ ప్రశ్నను స్పందించారు.
చెన్నైలోని వరద బీభత్సాన్ని పట్టించుకోకుండా.. ఆమీర్ ఖాన్, షీనా బోరాలకు సంబంధించిన అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయంటూ ఆయన ఆరోపించారు. సిద్ధార్థ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వ్యాఖ్యలు చేస్తూ.. మా గురించి కూడా మాట్లాడండి అంటూ జాతీయ మీడియాకి విజ్ఞప్తి చేశారు.
ఇక గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై స్తంభించిపోయింది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోయాయి. ఆదివారం సాయంత్రం అతిభారీ స్థాయిలో 69 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. తమిళనాడులోని పలు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. పంటపోలాలు నీటమునిగాయి.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి జయలలిత అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. దెబ్బదిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జయలలిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ మంత్రి ఆర్.బి. ఉదయ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరదల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు.
కాగా, భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రూ. 4 ఎక్స్ గ్రెషియా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆస్తినష్టం కలిగిన పేదలకు తక్షణ సాయంగా రూ. 20 వేలు అందజేయనున్నట్లు మంత్రి ఉదయ కుమార్ తెలిపారు. థేని, శివగంగా, దిండిగల్, నమక్కళ్ జిల్లాల్లో నష్టం పాళ్లు తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. అటు పాండిచేరి, లక్ష్యద్వీప్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని పలు తీరప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది.