Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సినిమా అట్టర్ ప్లాప్ అందుకే, కథలో వేలు పెట్టాడు.. కోర్టుకెక్కిన హీరో!
తమిళ చిత్ర పరిశ్రమలో హీరో శింబు, విశాల్ పేర్లు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోలు ఎదో ఒక వివాదంలో కనిపిస్తోనే ఉంటారు. తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శింబు అట్టర్ ప్లాప్ చిత్రానికి సంబంధించిన వివాదం విశాల్ మెడకు చుట్టుకుంది. 2017లో శింబు అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి మైఖేల్ రాయప్పన్ నిర్మాత. శింబుకు , రాయప్పన్ కు ఈ చిత్ర విషయంలో గొడవ జరుగుతూనే ఉంది.
కథలో జోక్యం చేసుకున్నాడు
అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర సమయంలో శింబు సరిగా షూటింగ్ కు వచ్చేవాడు కాదు. పైగా కథ విషయంలో జోక్యం చేసుకున్నాడు.దీని ఫలితంగానే సినిమా డిజాస్టర్ గా నిలిచి నాకు తీవ్రమైన నష్టాలని మిగిల్చిందని రాయప్పన్ ఆరోపిస్తున్నారు. తనకు శింబు నష్టపరిహారం చెల్లిచేలా చర్యలు తీసుకోవాలని రాయప్పన్ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. ఈ వివాదం విషయంలో శింబుని వివరణ అడుగుతూ నిర్మాతల మండలి నోటీసులు జారీ చేసింది.
శింబు కొత్త చిత్రానికి చిక్కులు
రాయప్పన్ వివాదంపై శింబు స్పందించక పోవడంతో నిర్మాతల మండలి అతడిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో శింబు కొత్త చిత్రం వందా రాజవదాన్ వరువేం చిత్ర విడుదల విషయంలో చిక్కులు ఏర్పడేలా కనిపిస్తోంది. దీనితో శింబు హై కోర్టుని ఆశ్రయించారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, రాయప్పన్ పై పిటిషన్ దాఖలు చేశారు.
5 కోట్లే తీసుకున్నా
అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి తాను నిర్మాతతో 8 కోట్ల రెమ్యునరేషన్ ఒప్పందం చేసుకున్నా. కానీ నాకు నిర్మాత కేవలం 5 కోట్లు మాత్రమే చెల్లించాడు. అయినా కూడా నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని శింబు పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ అనవసర పంచాయతీకి నిర్మాతల మండలి చైర్మన్ విశాల్ సహకరిస్తున్నాడని శింబు ఆరోపించాడు.
కౌంటర్ దాఖలు చేయండి
శింబు వేసిన ఫిటిషన్ విచారణ మంగళవారం జరిగింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు విశాల్ ని, రాయప్పన్ ని ఆదేశించింది. తన కొత్త చిత్రం విషయంలో నిర్మాతల మండలి ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలనీ శింబు కోర్టుని కోరాడు.