Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
యూనిట్ సభ్యులకు బంగారు నాణాలు... 200 మందికి పంచిన హీరో
గతంలో పులి సినిమా సందర్భంగా 265 మంది యూనిట్ సభ్యులకు ఇచ్చినట్టే మరోసారి తన తాజా చిత్ర యూనిట్ సభ్యులకు బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చాడు.
ఈ మద్య కొంత మంది స్టార్ హీరోలు తమ సినిమా కోసం కష్టపడ్డ దర్శకులకు, సంగీతం అందించిన వారికి ఇతర టెక్నీషియన్స్ గొప్ప గొప్ప బహుమతులు అందిస్తున్నారు. ఇప్పటికే తెలుగు లో ఎన్టీఆర్, మహేష్ బాబు, రాంచరణ్ లాంటి హీరోలు ఇలాంటి బహుమతులు అందించిన విషయం తెలిసిందే.
తన సినిమా యూనిట్ సభ్యులకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం కోలీవుడ్ హీరో విజయ్ కు ఉన్న అలవాటు. గతంలో పులి సినిమా సందర్భంగా 265 మంది యూనిట్ సభ్యులకు బంగారు నాణేలు గిఫ్ట్గా ఇచ్చాడు విజయ్. అదే తరహాలో విజయ్ మరోసారి తన తాజా చిత్ర యూనిట్ సభ్యులకు బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చాడు.
తాజాగా హీరో విజయ్ తన ప్రాజెక్ట్ కోసం కష్టపడిన చిత్ర యూనిట్ సభ్యులకు బహుమతులు ఇచ్చి సర్ఫ్రైజ్ చేశాడట. ఈ విషయాన్ని కోలీవుడ్ ఎనలిస్ట్ రమేశ్ బాలా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మెర్సల్ మూవీకి పనిచేసిన 200 మంది టెక్నీషియన్స్, వర్కర్స్ ఆయన బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడని ట్వీట్ చేశాడు.
మెర్సల్ సినిమాలో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా. దర్శకుడు ఎస్ జే సూర్య ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఆగస్టు 20 న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17 న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.