Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రజనీకాంత్ పోస్టర్ వివాదం-హిందూ సంఘాల ఆగ్రహం
రజనీకాంత్ ఓటు వేస్తున్నట్లు ఉన్న ఆ ఫోటోలో.....ఆయన వెనక ఉన్న క్యూలైన్లో హిందూ దేవుళ్లయిన వినాయకుడు, విష్ణుమూర్తి ఉన్నట్లు పోస్టర్ ఏర్పాటు చేసారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న అభిమానులు.....'నువ్వు రాజకీయాల్లోకి వస్తే దేవుళ్లు కూడా వచ్చి ఓటేస్టారు' అని రాసారు.
అభిమానులు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లపై ఆగ్రహంగా ఉన్న పలు హిందూ సంఘాలు ముఖ్యమంత్రి జయలలితకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని పలువురు మండి పడుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఇపుడు ఇది హాట్ టాపిక్ అయింది.
ఈ పోస్టర్పై.....రాజకయాల్లోకి రావాలని కోరుకుంటున్న అభిమానుల కోరికపై మరి రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఆయన సినిమా విశేషాల్లోకి వెళితే....ప్రస్తుతం రజనీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' చిత్రం చేస్తున్నారు. త్వరలోనే ఈఛిత్రం విడుదల కానుంది.