Just In
- 10 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 11 hrs ago
బాత్ టబ్ పిక్తో రచ్చ.. లైవ్కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 12 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 13 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్పై రోహిత్ వివరణ!!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిన్నవయస్సులోనే...: ప్రముఖ సినీ ఎడిటర్ మృతి
చెన్నై : ప్రముఖ చలనచిత్ర ఎడిటర్, జాతీయ పురస్కార గ్రహీత కిశోర్ జీవన్మృతి (బ్రెయిన్డెడ్) చెందారు. ఆయన వయసు 36 ఏళ్లు. 'పరదేశి', 'ఈరం', 'నెడుంజాలై', 'ఎదిర్నీచ్చల్'.. వంటి 30కి పైచిలుకు చిత్రాలకు ఎడిటర్గా వ్యవహరించారు. తెలుగులో 'ఉలవచారు బిర్యానీ', 'గగనం' చిత్రాలకు పనిచేశారు. కన్నడలో 'ఒక్కరానే' సినిమాకు కూడా ఎడిటింగ్ సేవలందించారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
పిన్నవయసులోనే ఉత్తమ జాతీయ స్థాయి పురస్కారాన్ని 'ఆడుగలం' చిత్రానికి అందుకున్నారు. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు కిశోర్ మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జీవన్మృతి చెందినట్లు వెల్లడించారు. కిశోర్ అవయవదానానికి వారి కుటుంబీకులు అంగీకరించారు. శనివారం ఉదయం అవయవాలు దానం చేయనున్నారు.

ఆయన ఇకలేరనే వార్తతో పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. కిషోర్.. దర్శకుడు వెట్టిమారన్ సినిమా ఎడిటింగ్ పనిలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు . హాస్పిటల్కు తరలించగా, మెదడులో రక్తం గడ్డ కట్టి మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తమిళంలో ఆయన ఎడిటర్గా పనిచేసిన ‘ఆడుకాలం' సినిమాకు గానూ ఆయనను జాతీయ అవార్డు వరించింది. ఆడుకాలం సినిమా.. పందెం కోళ్ళు పేరుతో జనవరి 30న తెలుగులో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మింపబడిన సినిమాలు గగనం, ఉలవచారు బిర్యాని వంటి సినిమాలు ఆయనకు తెలుగులోనూ మంచి పేరు తెచ్చిపెట్టాయి. కిషోర్ మృతి పట్ల అటు తెలుగు, తమిళ పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ప్రతిభా శాలి, యువకుడైన కిషోర్ ఇలా అర్థాంతరంగా చలించడంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది.