Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాస్ రమ్మన్నాడు....అనసూయ రానంది, ఎందుకు?
బిగ్ బాస్ షో కోసం యాంకర్ అనసూయను సంప్రదించగా ఆఫర్ రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ఎవరీ బాస్ అనుకుంటున్నారా?.... త్వరలో తెలుగు బుల్లితెరపై సందడి చేయబోతున్న 'బిగ్ బాస్'. ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభం కాబోతున్న ఈ రియాల్టీ షో కోసం 12 మంది ప్రముఖ సెలబ్రిటీల ఎంపిక కార్యక్రమం మొదలైంది.
ఫస్ట్ సీజన్ కాబట్టి బాగా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలను ఇందులో పోటీదారులుగా నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ ఆఫర్లతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే పోసాని కృష్ణ మురళికి రూ. 2.5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఇంకా ఏ విషయం తేల్చలేదట. యాంకర్ సుమకు కూడా ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా బిజీ షెడ్యూల్ కారణంగా తాను రాలేనని తేల్చి చెప్పిందట.
నో చెప్పిన అనసూయ
తాజాగా యాంకర్ అనసూయను కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం. అయితే తనకు ఇప్పటికే చాలా కమిట్మెంట్లు ఉన్నాయనే కారణం చూపుతూ అనసూయ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
పోసాని, మధు శాలిని, తేజస్వి
బిగ్ బాస్ షో కోసం ఇప్పటికే పోసాని కృష్ణ మురళికి రూ. 2.5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మధు శాలిని, తేజస్వి మదివాడ లాంటి వారికి కూడా రూ. 20 లక్షలతో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. త్వరలో ‘బిగ్ బాస్'లో ఎవరెవరు ఫైనల్ అయ్యారనే విషయాలు బయటకు రానున్నాయి.
ఎన్టీఆర్ ‘బిగ్ బాస్' ...ఎలా సాగుతుంది? సామాన్యులకు చోటు లేదా?
ఎన్టీఆర్ ‘బిగ్ బాస్' ...ఎలా సాగుతుంది? సామాన్యులకు చోటు లేదా?.... ఇలాంటి సందేహాలు మీకూ ఉండే ఉంటాయి. ఈ షోకు సంబంధించిన
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అదరగొట్టిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో 'బిగ్ బాస్' అనే రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ మాటీవీలో ఈ షో త్వరలో ప్రసారం కాబోతోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన టీజర్ రిలీజైంది. జేమ్స్ బాండ్ సినిమా టీజర్ గుర్తొచ్చేలా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్తో ఈ టీజర్ డిజైన్ చేశారు. దీన్ని చూస్తుంటే జేమ్స్ బాండ్ గొర్తొస్తున్నాడని, ఎన్టీఆర్ అలాంటి పాత్రలకు బాగా సూటవుతాడని అనిపిస్తోందని అంటున్నారు అభిమానులు.