Bigg Boss: షోలో ప్రియాంక వింత ప్రవర్తన.. అర్ధరాత్రి అతడితో ఊహించని విధంగా.. ఇబ్బంది పెట్టకు అంటూ!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని.. అత్యధిక రేటింగ్ను సొంతం చేసుకుంటూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇదే ఉత్సాహంతో నిర్వహకులు ఏకంగా నాలుగు సీజన్లను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో దాన్ని కూడా మొదలు పెట్టారు. ఇందులోకి కంటెస్టెంట్లుగా వచ్చిన వారిలో ప్రత్యేకంగా నిలిచింది మాత్రం టాన్స్జెండర్ ప్రియాంక సింగే అని చెప్పాలి. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ బరువైన బాధ్యతను తలకెత్తుకున్న ఆమె.. ప్రశంసలు అందుకుంటూ సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్లో పింకీ వింతగా ప్రవర్తించి షాకిచ్చింది. ఆ సంగతులు మీకోసం!
Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఏకంగా అంత మంది... స్పెషల్ తనే
ఐదో సీజన్లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ప్రియాంక సింగ్ అలియాస్ జబర్ధస్త్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్ అయింది. జబర్ధస్త్లో లేడీ గెటప్లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్న సాయితేజ.. సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్ పట్టేసింది.

ఆరంభంలోనే ఫోకస్.. అదరగొడుతూ
తాజా సీజన్లో ప్రియాంక సింగ్ ట్రాన్స్జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. అయితే, పింకీ మాత్రం ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే ఈర్శ పడేంత అందంగా తయారవుతూ హుందాగా ఉంటోంది.

ప్రియాంక వింత లవ్ ట్రాక్ హైలైట్గా
బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే ప్రియాంక సింగ్ ఫోకస్ అవుతోంది. ఆమె రూపం, ఆట తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈమె ఆరంభం నుంచే మానస్తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. దీంతో వీళ్ల వింత ట్రాక్ కూడా హైలైట్ అవుతూ ఉంది.

ఆటపట్టిస్తూ.. అల్లరి చేస్తూ సందడిగా
బిగ్ బాస్ హౌస్లో కనిపించే లవ్ ట్రాకులపై ప్రత్యేకమైన శ్రద్ద ఉంటుంది. ఐదో సీజన్లో కూడా పలువురు జంటలుగా మారతారని అంతా అనుకున్నారు. కానీ, ప్రియాంక సింగ్ వ్యవహారాన్ని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆమె మానస్తో చనువుగా ఉండడానికి ప్రయత్నించడంతో కంటెస్టెంట్లు ఆట పట్టిస్తున్నారు. అదే సమయంలో తెగ అల్లరిగా ఉంటూ సందడి చేసేస్తున్నారు.

షోలో ప్రియాంక సింగ్ వింత ప్రవర్తన
ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్క్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక.. షణ్ముఖ్, జెస్సీతో కలిసి ఎల్లో టీమ్లో ఉంది. అందులో చక్కగా ఆడుతూ వీలైనన్ని ఎక్కువ బొమ్మలు తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత ఎపిసోడ్లో పింకీ వింతగా ప్రవర్తించింది. దీంతో అసలేం జరిగిందో అర్థం కాక అందరూ అవాక్కవుతున్నారు.

మానస్ను అలాంటి ప్రశ్నలు అడిగి
ప్రియాంక అర్ధరాత్రి సమయంలో మానస్తో మాట్లాడుతూ.. 'కోపంగా ఉన్నావా? నీతో మాట్లాడొచ్చా' అని ముందుగా పర్మీషన్ తీసుకుంది. ఆ తర్వాత 'టాస్క్లలో నేను 100 పర్శంట్ ఎఫర్ట్ ఇస్తున్నానా? నువ్ అంటుంటావ్ కదా.. నేనొక బోర్డర్ పెడతా దాన్ని ఎవరూ క్రాస్ చేయలేరు అని.. నేనెప్పుడైనా అది క్రాస్ చేసినట్టు నీకు అనిపించిందా?' అంటూ వింత ప్రశ్నలు అడిగింది.
Recommended Video

పింకీ కన్నీరు.. మానస్ ఓపికగా ఉండి
ప్రియాంక వింత వింత ప్రశ్నలు అడగడంతో మానస్ చాలా కామ్గా సమాధానాలు ఇచ్చాడు. 'ఈ ప్రశ్న చాలాసార్లు అడుగుతున్నావ్ ఎందుకు? ప్రతి ఒక్క రిలేషన్లోనూ అంచనాలు ఉంటాయి. అది వాళ్లు రీచ్ కాలేకపోతే ఫీల్ అయిపోయినట్టు కాకుండా మంచి ఒపీనియన్ ఉండాలనే బార్డర్ పెడతా. ఈ విషయం పదే పదే అడిగి ఇబ్బంది పడకు.. నన్ను పెట్టకు' అని చెప్పాడు. ఈ మాటలకు పింకీ ఏడ్చేసింది. కానీ ఏమైందన్న విషయం మాత్రం తెలియలేదు.


Click it and Unblock the Notifications











