Mahesh Babu:ఆ ఇద్దరి డ్యాన్స్​కు మహేశ్​ బాబు ఫిదా.. ఊహించని సర్​ప్రైజ్ గిఫ్ట్​!

సూపర్​ స్టార్​ కృష్ణ నట వారసుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన మహేశ్​ బాబు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్​ సంపాదించుకున్నాడు. హిట్​లు, ఫట్​లు అని ఆలోచించకుండా ప్రయోగాత్మక సినిమాలను ఎంకరేజ్​ చేస్తుంటాడు. ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చూసుకుంటూ పోయే హీరోగా ముద్ర వేసుకున్నాడు. అంతేకాకుండా అనేక మంది చిన్నారులకు హార్ట్​ ఆపరేషన్స్​ నిర్వహించి సరిలేరు తనకెవ్వరూ అని రియల్ సూపర్ స్టార్​ అనిపించుకున్నాడు. తాజాగా ఓ ఇద్దరు డ్యాన్స్ షో కంటెస్టెంట్స్​కు అదిరిపోయే బహుమతి ఇచ్చి నిజమైన రాజకుమారుడని మరోసారి నిరూపించాడు.

పాన్​ ఇండియా స్థాయిలో..

పాన్​ ఇండియా స్థాయిలో..

ఇటీవల సర్కారు వారి పాట చిత్రంతో మంచి విజయం అందుకున్న సూపర్​ స్టార్ మహేశ్ బాబు వరుస సనిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నాడు. మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో ఓ సినిమా, దర్శక ధీరుడు రాజమౌళితో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జక్కన్నతో తెరకెక్కించే మూవీని పాన్​ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు.

గారాల కూతురు సితారతోపాటు..

గారాల కూతురు సితారతోపాటు..

ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు బుల్లితెరపై సందడి చేశాడు. అది కూడా ఆయన గారాల కూతురు సితారతో కలిసి. ప్రముఖ టీవీ ఛానెల్​ జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్యాన్స్​ ఇండియా డ్యాన్స్ షోకి మంచి స్పందన లభిస్తోంది. ఈ షోలోలని ఓ ఎపిసోడ్​లో సితారతో కలిసి మహేశ్ బాబు దర్శనమివ్వనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్​గా మారింది.

డ్యాన్స్​కు మహేశ్​ బాబు ఫిదా..

డ్యాన్స్​కు మహేశ్​ బాబు ఫిదా..

అయితే ఈ షోలో పార్టిస్​పేట్​ చేసే ఇద్దరు కంటెస్టెంట్లకు మహేశ్​ బాబు అదిరిపోయే గిఫ్ట్​ ఇచ్చాడు. ఈ షోలో బాబు అండ్​ కుమార్​ చేసిన డ్యాన్స్​కు ఫిదా అయిన మహేశ్ బాబు వారికి ఒక ఆఫర్​ ఇచ్చాడు. ''మీకు హ్యాట్సాఫ్​. మీరు నటించలేదు. జీవించేశారు. నేను చేసే సినిమా గానీ, నేను తీసే సినిమాలో గానీ మీకు కచ్చితంగా అవకాశం ఇస్తాను'' అని తెలిపాడు.

సితార సైతం..

సితార సైతం..

ఈ ఒక్క మాటతో స్టేజ్​ అంతా చప్పట్లో మారుమోగిపోయింది. తమకు అవకాశం ఇస్తా అన్న మహేశ్ బాబు కాళ్లపై బాబు అండ్​ కుమార్​ పడగా, వారిని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు మహేశ్ బాబు. అలాగే ఇందులో పాల్గొన్న సితార సైతం వారి డ్యాన్స్​ పెర్ఫామెన్స్​ను ''ఇట్ వాస్​ మైండ్​ బ్లోయింగ్'' అంటూ పొగిడింది.

వచ్చే ఏడాది మార్చిలో..

ఇక మహేష్ బాబు సినిమా విషయానికొస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్​తో తెరకెక్కుతున్న చిత్రం చిత్రీకరణను ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్​లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే విడుదలపై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తప్పకుండా అనుకున్న సమయానికి వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అధికారికంగా స్పష్టతనిచ్చారు.

అత్యధిక బడ్జెట్​తో..

అత్యధిక బడ్జెట్​తో..

త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తర్వాత మళ్లీ వెంటనే రాజమౌళి సినిమాతో బిజీ కానున్నాడు మహేశ్​ బాబు. ఆ ప్రాజెక్ట్ మహేశ్ బాబు కెరీర్​లోనే అత్యధిక బడ్జెట్​తో వెండితెరపైకి రానుంది. సుమారు రూ. 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో ప్రముఖ హీరో కనిపిస్తాడని టాక్ కూడా నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X