యువ టెలివిజన్ నటి మృతి!.. బాత్రూంలో అనుమానాస్పదంగా.. హత్య? ఆత్మహత్యా!
యువ నటి ఆత్మహత్యతో టెలివిజన్ పరిశ్రమ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. అలీబాబా: దస్తాన్ ఏ కాబూల్తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న తునీశా శర్మ ఇక లేరు. రియాలిటీ షో సెట్లోనే అనుమానాస్పద పరిస్థితుల్లో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. తునీశా మరణంతో అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సినీ వర్గాలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. తునీశా శర్మ కెరీర్, ఆమె మరణం వెనుక ఉన్న కారణాల్లోకి వెళితే..

షూటింగు ప్రాంతంలోనే..
తునిశా శర్మ టెలివిజన్ యాక్టర్గా ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా రాణిస్తున్నారు. ఆమె వయసు 20 సంవత్సరాలు. అలీబాబా దస్తాన్ ఏ కాబూల్ అనే షోతో భారీ పాపులారిటీ సంపాదించుకొన్నారు. ఈ సో ప్రముఖ ఛానెల్ సాబ్ టెలివిజన్లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. శనివారం రోజున ముంబైలోని వసాయి ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్కు శనివారం హజరయ్యారు.

బాత్రూంలో అనుమానాస్పద పరిస్థితుల్లో
అలీబాబా దస్తాన్ ఏ కాబూల్ అనే షో షూటింగులో పాల్గొన్న తర్వాత బ్రేక్లో ఆమె బాత్రూమ్కు వెళ్లింది. బాత్రూం నుంచి ఎంతకు రాకపోవడంతో సిబ్బంది వెళ్లి వెతికారు. అయితే ఆమె మృతదేహం బాత్రూంలో పడి ఉండటాన్ని చూసిన యూనిట్ సిబ్బంది షాక్ గురయ్యారు. అయితే పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఆమెది ఆత్మహత్యనా? లేదా ఆమె మరణం వెనుక మరేమైనా కారణం ఉందా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హత్యనా? ఆత్మహత్యనా?
తునీశా శర్మ మరణంపై ముంబై పోలీసులు స్పందించారు. తునీశా శర్మ మృతదేహాన్ని స్వాధీనపరుచుకొన్నాం. ఆమె బాడీని పోస్టు మార్టంకు పంపించాం. అయితే ఆమె సూసైడ్ చేసుకొన్నారా? లేదా హత్యనా? లేదా సహజ మరణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. అయితే ప్రాథమిక విచారణ అనంతరం ఆమె మరణాన్ని ఆత్మహత్యగా భావిస్తున్నాం. మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత ఆమె మరణం వెనుక అసలు కారణాన్ని వెల్లడిస్తాం అని పోలీసులు తెలిపారు.

చిత్ర యూనిట్ వెల్లడించిన ప్రకారం..
తునీశా శర్మ మరణంపై చిత్ర యూనిట్ కూడా స్పందించింది. టెలివిజన్ షూటింగ్ స్పాట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూనిట్ సిబ్బంది చూసి ఆమె బాడీని హాస్పిటల్కు తరలించాం. కానీ మార్గమధ్యంలోనే చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. అయితే ఆమె ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు అని చెప్పారు.

ఇన్స్టాగ్రామ్ పోస్టు వైరల్
యువ నటి తునీశా శర్మ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. ఆమె మరణానికి ముందు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు పెట్టారు. తన ఫోటోను పోస్టు చేసి.. ఎవరైనా బలమైన సంకల్పంతో ఏదైనా చేయాలనుకొంటారో.. ఆ పనిని ఎప్పటికీ ఆపకూడదు అనే కామెంట్ను పోస్టు చేశారు. ఆమె మరణానికి ముందే తీవ్రమైన ఆందోళనతో ఉన్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించినట్టు సమాచారం.

తునీశా శర్మ కెరీర్ ఇలా..
తునీశా శర్మ కెరీర్ విషయానికి వస్తే.. సోని టెలివిజన్ ప్రసారం చేసిన మహరాణా ప్రతాప్ సీరియల్లో చాంద్ కన్వర్ అనే పాత్ర ద్వారా కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత కలర్స్ టెలివిజన్లో చక్రవర్తి అశోక సామ్రాట్ అనే సీరియల్లో నటించింది. ఇక బాలీవుడ్లో కత్రినా కైఫ్ నటించిన ఫితూర్ అనే సినిమా ద్వారా హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో కత్రినాకు సోదరిగా నటించింది. బార్ బార్ దేఖో చిత్రంలో నటించింది. ఇంకా నహి దునియా, కహానీ 2 దుర్గా రాణిసింగ్, షేర్ ఏ పంజాబ్ మహరాజా రంజిత్ సింగ్, ఇంటర్నెట్ వాలా లవ్ అనే సీరియల్స్లో నటించింది.


Click it and Unblock the Notifications











