Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరుణ్ తేజ్, వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాకు అరుదైన గౌరవం.. తెలుగు నుంచి ఈ ఒక్కటే
వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి సక్సెస్ సాధించిన F2 సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగబోయే 50వ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఏఫ్ఏఫ్ఐ) ప్రదర్శనకు ఈ సినిమా ఎంపిక కావడం విశేషం. తెలుగు సినిమాల్లోని ఈ ఒక్క సినిమాకే ఈ అవకాశం దక్కింది.
నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఏఫ్ఏఫ్ఐ) వేడుక జరగనుంది. ఈ వేడుకలో మొత్తం 76 దేశాలకు చెందిన 250 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇందులో 26 ఫీచర్ ఫిలింస్ ఉండగా 15 నాన్ ఫీచర్ ఫిలింస్ ఉన్నాయి. అయితే ఈ 26 ఫీచర్ ఫిలింస్లో ఎంపికైన ఏకైక తెలుగు చిత్రంగా F2 తన పేరును లికించుకుంది.

అనిల్ రావిపూడి తెరకెక్కించిన F2 సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందింది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ వేడుకకి పది వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ అరుదైన అవకాశం దక్కడం పట్ల చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం వెంకటేష్.. వెంకీమామ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుందని సమాచారం. మరోవైపు గద్దలకొండ గణేష్ రూపంలో వరుణ్ తేజ్ ఇటీవలే సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు.