Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వరుణ్ తేజ్, వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాకు అరుదైన గౌరవం.. తెలుగు నుంచి ఈ ఒక్కటే
వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి సక్సెస్ సాధించిన F2 సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగబోయే 50వ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఏఫ్ఏఫ్ఐ) ప్రదర్శనకు ఈ సినిమా ఎంపిక కావడం విశేషం. తెలుగు సినిమాల్లోని ఈ ఒక్క సినిమాకే ఈ అవకాశం దక్కింది.
నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఏఫ్ఏఫ్ఐ) వేడుక జరగనుంది. ఈ వేడుకలో మొత్తం 76 దేశాలకు చెందిన 250 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇందులో 26 ఫీచర్ ఫిలింస్ ఉండగా 15 నాన్ ఫీచర్ ఫిలింస్ ఉన్నాయి. అయితే ఈ 26 ఫీచర్ ఫిలింస్లో ఎంపికైన ఏకైక తెలుగు చిత్రంగా F2 తన పేరును లికించుకుంది.
అనిల్ రావిపూడి తెరకెక్కించిన F2 సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందింది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ వేడుకకి పది వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ అరుదైన అవకాశం దక్కడం పట్ల చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం వెంకటేష్.. వెంకీమామ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుందని సమాచారం. మరోవైపు గద్దలకొండ గణేష్ రూపంలో వరుణ్ తేజ్ ఇటీవలే సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు.