Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆది సాయికుమార్, వేదిక జంటగా కొత్త సినిమా ప్రారంభం
ఆది సాయికుమార్, వేదిక హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా ప్రారంభం అయింది. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ సురవరం చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్ పై.లి. బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.
గతంలో తెలుగులో విజయ దశమి, బాణం చిత్రాల్లో నటించిన వేదిక 2011లో చివరగా 'దగ్గరగా దూరంగా' అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో నటిస్తోంది. ప్రమకథా చిత్రంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది.
మార్చి 25 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చిత్తూరు జిల్లాలోని తలకోనలో ప్రారంభం కానుంది. రోబో, 2.0 చిత్రాలకు అసోసియేట్ కెమెరామెన్గా పనిచేసిన గౌతమ్ జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సి.సత్య సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ చిత్ర నిర్మాణంలో న్యూ ఏజ్ సినిమా, తిరు కుమరన్ ఎంటర్టైన్మెంట్స్ అసోసియేట్ అవుతున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.
దర్శకత్వం:
కార్తీక్
విఘ్నేశ్
నిర్మాత:
కావ్య
వేణుగోపాల్
నిర్మాణ
సంస్థలు:
ఎంవి
అరా
సినిమాస్
ప్రై.లి,
న్యూ
ఏజ్
సినిమా,
తిరు
కుమరన్
ఎంటర్టైన్మెంట్స్
మ్యూజిక్:
సి.సత్య
సినిమాటోగ్రఫీ:
గౌతమ్
జార్జ్