Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఏపీ ఎన్నికల బరిలోకి తారకరత్న.. లోకేష్తో భేటీ.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటికే పొలిటికల్ హీట్ భారీగా క్రియేట్ అయింది. ఏపీలోని అన్ని పార్టీలు రానున్న ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలను సిద్దం చేసుకొంటున్నాయి. అంతేకాకుండా గెలుపు గుర్రాలపై దృష్టిపెట్టి అభ్యర్థులను ఖరారు చేసుకొంటున్నాయి. ఇప్పటికే చంద్రబాబు రాజకీయ పర్యటన చేస్తుండగా, పవన్ కల్యాణ్ త్వరలోనే బస్ యాత్రకు సిద్దమవుతున్నారు.
అయితే చాలాకాలంగా టీడీపీకి సేవ చేస్తున్న దివంగత ఎన్టీఆర్ మనవడు, నటుడు తారకరత్న క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్తో భేటీ కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లోకేష్, తారకరత్న భేటీ వివరాల్లోకి వెళితే..
గత ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల్లో తారకరత్న చురుకుగా పాల్గోన్నారు. పార్టీ ప్రచారా కార్యక్రమాల్లో భాగం పంచుకొని సేవలు చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా తన సేవలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలను కోరినట్టు సమాచారం. ఈ మేరకు లోకేష్ను కలిసి తన భవిష్యత్ కార్యచరణను తెలియజేసినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో నందమూరి కుటుంబానికి పార్టీలో పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. ఆ నిర్ణయంలో భాగంగానే లోకేష్ను కలిసి అంతర్గత వ్యవహారాలను చర్చించుకొన్నారు.
ఇదిలా ఉండగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగేందుకు తారకరత్న సిద్దమవుతున్నట్టు సమాచారం. ఏపీ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించాలని తారకరత్న నిర్ణయం తీసుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లా గానీ, మరో నియోజకవర్గం నుంచి గానీ పోటీ చేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తన క్రియాశీలక రాజకీయాలు, పార్టీ సేవల వినియోగం గురించి తారకరత్న, లోకేష్ మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.