Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆసక్తికర ప్రకటన చేసిన అమలా పాల్.. కుడి ఎడమైతే అంటూ!
మొట్టమొదటి తెలుగు ఓటీటీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆహా మిగిలిన అన్ని సంస్థలతో పోటాపోటీగా వరుసగా సినిమాలను, సిరీస్ లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క తెలుగు కంటెంట్ తో పాటు ఇతర భాషలలో బాగా ఆడిన సినిమాలను కూడా కొన్ని డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. అయితే తాజాగా అమలాపాల్ లీడ్ రోల్ లో ఒక ఆసక్తికర ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. త్వరలో ఆహాలో 'కుడి ఎడమైతే' అనే ప్రస్టీజియస్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మీద ఆసక్తి రేకెత్తించే విధంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఇండియాలోనే డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్న తొలి సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని అంటున్నారు. రామ్ విఘ్నేశ్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ను 'లూసియా', 'యూ టర్న్' వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించారు. ఈ సిరీస్ మోషన్ పోస్టర్ ఈరోజు 26వ తేదీన రిలీజ్ చేశారు.
ఈ మోషన్ పోస్టర్లో గోడపై అతికించిన నోటీసులు, ఒక గన్, ఒక వాల్ క్లాక్ లాంటి వాటిని చూపారు. ఇక ఆ విజువల్స్ చూశాక ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తడం ఖాయం. ఈ మోషన్ పోస్టర్ లో అమలా పాల్, అసలు ఏమాత్రం కనికరం లేని ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుంటే.. రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సిరీస్లో ప్రేక్షకులకు ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఇక ఈ సిరీస్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది, అనే విషయాలను త్వరలోనే వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.