Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దాండియాతో ఆకట్టుకున్న టిక్ టాక్ ఆర్టిస్టులు.. ధన్య బాలకృష్ణ జోరుగా
దసరా సందర్భంగా భాగ్యనగరంలో పలుచోట్ల అనేక దాండియా కార్యక్రమాల జోరు కొనసాగింది. పండుగ సీజన్లో టిక్ టాక్ నటీనటులు కూడా ఈ సంబరాల్లో ఏమీ తక్కువ కాదు అని నిరూపించుకున్నారు వీరభద్ర క్రియేషన్స్ నిర్వహించిన టిక్ టాక్ దాండియా కార్యక్రమంలో టిక్ టాక్ ఆర్టిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని దాండియా ఆడుతూ ఆకట్టుకున్నారు. ప్రముఖ సినీ నటి ధన్య బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు.
సోషల్ మీడియా జోష్ ఉండటంతో సామాన్యులు కూడా ఈ మధ్య కాలంలో టిక్ టాక్ ఆసరగా చేసుకొని ఔత్సాహికులు చాలా బాగా రాణిస్తున్నారు అని ధన్య బాలకృష్ణ పేర్కొన్నారు. దసరా అనగానే నగరమంతా కోలాటాలతో నిండు పోతుంది కానీ ఈ సారి నాకు టిక్ టాక్ నటీనటులతో కలిసి ఆడే అవకాశం లభించినందుకు ఆనందిస్తున్నా అని అన్నారు. టిక్ టాక్ యువతీ యువకులు ఎంతో నైపుణ్యంతో నటిస్తున్నారు అని ఆమె తెలిపారు.
రాబోయే రోజుల్లో టిక్ టాక్లో ప్రతిభ చాటుకొంటున్న నటులు అందరికీ సినిమా రంగంలో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని ధన్య తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు హేమలత రెడ్డి (బుజ్జియాక్టర్) మాట్లాడుతూ టిక్ టాక్ నటుల అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని తెలిపారు.
ప్రతి ఏడాది టిక్ టాక్ నటీనటులు అందరికీ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బాగా ప్రదర్శన చేసిన నటులు హర్షిత్ రెడ్డి,అవినాష్, కళ్యాణ్ మరియు జిగేల్ రాజా అనే యువకులకు బహుమతులు అందజేసి సత్కరించారు.