రామ్ చరణ్ - శంకర్ ప్రాజెక్ట్ పై దిల్ రాజు మరో అఫీషియల్ అప్డేట్.. అసలైన రచ్చ మొదలయ్యేది అప్పుడే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్స్ పైకి వస్తున్నాయి. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు హీరోతో సినిమా చెయ్యాలని అనుకుంటున్న కోరిక కూడా నెరవేరబోతోంది. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల తిరుపతికి వెళ్లిన దిల్ రాజు మరోసారి ఆ బిగ్ కాంబోపై అసలైన అప్డేట్ ఇచ్చారు.

మరోక పెద్ద మైనస్ గా మారింది
దర్శకుడు శంకర్ హిట్టు అందుకొని చాలా కాలం అయ్యింది. రోబో అనంతరం ఏ సినిమా కూడా ఆయన స్థాయికి తగ్గట్లుగా అభిమానులను సంతృప్తి పరచలేకపోయింది. ముఖ్యంగా 2 పాయింట్ ఓ సైతం బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి తగ్గట్లుగా రాబట్టలేకపోయింది. ఇక ఇండియన్ 2 మధ్యలోనే ఆగిపోవడం మరోక పెద్ద మైనస్ గా మారింది.

ఎక్కువగా తెలుగు వాళ్లనే
ఫైనల్ గా లైకా ప్రొడక్షన్ తో ఇండియన్ 2 గోడవ నుంచి బయటపడిన శంకర్ రామ్ చరణ్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దర్శకుడు శంకర్ ఆల్ మోస్ట్ టీమ్ మొత్తాన్ని సెట్ చేసుకున్నాడు. ఎక్కువగా తెలుగు వాళ్లనే సెట్ చేసుకోవడం విశేషం.

సరైన కాంబో సెట్టవ్వడంతో
ఇప్పటికే డైలాగ్స్ రైటర్ గా సాయి మాధవ్ బుర్ర ఫిక్స్ అయ్యారు. అలాగే థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ కొట్టేశాడు. జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. హీరోయిన్ విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నారు. మొత్తానికి సరైన కాంబో సెట్టవ్వడంతో సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.
Recommended Video


షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..
ఇక రీసెంట్ గా దిల్ రాజు తిరుపతికి వెళ్లగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తు సినిమాలపై క్లారిటీ ఇచ్చేశారు. శంకర్ - రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ లో తప్పకుండా మొదలవుతుందని చెప్పారు. అలాగే ఐకాన్ సినిమాను కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు దిల్ రాజు వివరణ ఇచ్చారు. ఇక RC 15వ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











