Don't Miss!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
సోనుసూద్కు ఆలయం కట్టించిన సిద్దిపేట గ్రామస్థులు.. రియల్ హీరో రియాక్షన్ ఏమిటంటే!
లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను అక్కున చేర్చుకొన్న బాలీవుడ్ నటుడు సోనుసూద్కు మరో అరుదైన గౌరవం దక్కింది. సోనుసూద్ చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణాలోని సిద్దిపేటలోని దుబ్బ తండా గ్రామస్థులు ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో సోనుసూద్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం సోనుసూద్ ఆలయానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సిద్దిపేటలోని దుబ్బ తండా గ్రామస్థులు నటుడు సోనుసూద్ సేవలకు అరుదైన గుర్తింపునిచ్చారు. ఆయనకు గుడికట్టి పూజలు నిర్వహించారు అని ప్రముఖ వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోనుసూద్ ఎంతో మందికి అండగా నిలిచారు. ఆయన చేసిన సేవలతో మేము స్పూర్తి పొందాం. అందుచేతనే ఆయనకు ఆలయం నిర్మించాం అంటూ స్థానికుడు మీడియాకు వెల్లడించారు.
తనకు గుడి కట్టించిన వార్తపై నటుడు సోనుసూద్ స్పందించారు. ఆ విషయం నాకు చాలా సంతోషం కలిగించింది. కానీ వారు ప్రేమతో అందించిన పనికి నేను అర్హుడిని కాను. ఓ సాధారణ వ్యక్తిగా నా సోదరి సోదరులకు అందించిన సహాయం మాదిరిగానే నేను చేయూత ఇచ్చాను అని సోనుసూద్ పేర్కొన్నారు.