Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
గోపీచంద్ మూవీ నుంచి సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్: అదే వదలబోతున్నారు
చాలా కాలంగా హిట్ లేక సతమతం అవుతున్నాడు టాలెంటెడ్ హీరో గోపీచంద్. వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించినా అతడికి సక్సెస్ దూరంగానే ఉంటోంది. దీంతో జయాపజయాలతో సంబంధం లేకుండా మూవీలు చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతితో కలిసి 'పక్కా కమర్షియల్' అనే సినిమాను చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. ఇంతలో కరోనా రెండో దశ ఎక్కువ అవడంతో చిత్రీకరణను నిలిపి వేశారు.
సరికొత్త కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న 'పక్కా కమర్షియల్' మూవీ నుంచి ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఓ సర్ప్రైజ్ రాబోతుందట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆ అప్డేట్ ఏమై ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు చిత్ర నిర్మాత బన్నీ వాస్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది కాని పక్షంలో 'పక్కా కమర్షియల్' సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని అంటున్నారు. దీంతో ఆ ఆప్డేట్పై ఆసక్తి నెలకొంది.
కమర్షియల్ పంథాలో సాగే కామెడీ ఎంటర్టైనర్ మూవీగా రూపొందుతోన్న 'పక్కా కమర్షియల్' మూవీలో గోపీచంద్ లాయర్గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రకటన సమయంలో దీన్ని అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారట. అందులో ఒకరు గ్లామరస్ క్వీన్ రాశీ ఖన్నా కాగా.. మరొకరు తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా అని తెలుస్తోంది.