Just In
- 1 hr ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 1 hr ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 2 hrs ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 3 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- Sports
ఆ ఒక్క కారణంతోనే కేదార్ జాదవ్ను ధోనీ వదిలేశాడు: గౌతం గంభీర్
- News
కిసాన్ పరేడ్ .. సింఘూ, తిక్రీ , ఘాజీపూర్ బోర్డర్ లో ఉద్రిక్తత .. పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రైతుల సమస్యను పరిష్కరించండి.. కేంద్రానికి హీరో కార్తీ బహిరంగ లేఖ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొన్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసనకు దిగారు. దేశ రాజధాని ఢిల్లీని రైతులు దిగ్భందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ హక్కుల సాధనకు ఉత్తరాది రాష్ట్రాల రైతులు కదం తొక్కుతూ ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, రైతుల ఆందోళనపై స్పందించాలంటూ తమిళ నటుడు కార్తీ కేంద్రానికి లేఖ రాశారు. రైతుల హక్కులను కాపాడే విధంగా కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాలని, రైతుల ఆవేదనను సర్కారు పట్టించుకోవాలని లేఖలో కోరారు.
రైతులు చేపట్టిన ఆందోళనపై మోదీ ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలి. రైతుల ఆందోళనలో పెద్ద ఎత్తున్న మహిళలు, వృద్ధులు పాల్గొంటున్నారు. ఓ చరిత్రాత్మక ఆందోళనకు దారి తీసేలా కనిపిస్తున్నది. కాబట్టి వెంటనే చర్చలు జరపాలి అని కార్తీ తన లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల ఢిల్లీలో రైతుల ఆందోళనపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. ఓ వృద్ధురాలి ఫోటోను ట్వీట్ చేస్తూ.. షహీన్ బాగ్ అల్లర్లలో పాలుపంచుకొన్న మహిళ అంటూ కామెంట్ చేసింది. అయితే ఆమె పంజాబ్కు చెందిన మహిళ మహిందర్ కౌర్ అంటూ పలువురు ట్యాగ్ చేయడంతో గందరగోళం నెలకొన్నది.