Don't Miss!
- Technology 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- News ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇదే మొదటి సినిమా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’పై మహేష్ బాబు
సినిమా పరిశ్రమ ఈ ఏడాది ఎంతటి భారీ నష్టాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ఇండస్ట్రీ అనే కాదు.. అన్ని రంగాలు కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయింది. అందులో ముఖ్యంగా సినీ పరిశమ్ర మొత్తానికి మూత పడటంతో, సినీ కార్మికులు, థియేటర్లు, ఇలా ఎన్నో రకాలుగా అనుబంధ సమస్యలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడిప్పుడే థియేటర్లు పున: ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగులో ఓ పెద్ద సినిమా విడుదలకు సిద్దమైంది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సోలో బ్రతుకే సో బెటర్ అనే ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. కరోనా లాంటి పరిస్థితిని దాటి థియేటర్లలోకి రాబోతోన్న ఈ సినిమాను ఇండస్ట్రీ మొత్తం దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బాగా ఆడాలని, మళ్లీ థియేటర్లలో మునుపటి పండుగ, సందడి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు సైతం సోలో బ్రతుకే సో బెటర్ గురించి మాట్లాడాడు.
క్రిస్మస్కు రిలీజ్ అవుతోన్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా యూనిట్కు ఆల్ ది బెస్ట్.. కరోనా లాంటి క్లిష్ట సమయంతో థియేటర్లో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా.. అదే ఈ చిత్రానికి ఓ పెద్ద మైల్ స్టోన్... సాయి ధరమ్ తేజ్, చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్.. తమన్, సుబ్బు, నభా నటేష్లను ట్యాగ్ చేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ సినిమా ఫలితంపైనే సంక్రాంతి పోరు ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఒక వేళ జనాలు సినిమా కోసం థియేటర్ వరకు వస్తే.. సంక్రాంతి బరిలో మజా ఉండేట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది మొత్తం ఎలాగూ బాక్సాఫీస్ కళ తప్పినట్టైంది కాబట్టి సంక్రాంతికి మళ్లీ రికార్డ్ కలెక్షన్లు ఇండస్ట్రీలో నమోదు అవుతాయేమో చూడాలి.