Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'అశ్వద్ధామ'లో పవన్ కళ్యాణ్ వాయిస్.. ఫస్ట్టాక్ ఎలా ఉందంటే!
Recommended Video
విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ వెళ్తున్న యంగ్ హీరో నాగశౌర్య తాజాగా 'అశ్వద్ధామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా నేడు (జనవరి 31) విడుదలైంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన జనం వారి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు చూస్తే..
పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్.. మూవీ స్టార్ట్
గత సినిమా 'నర్తనశాల'తో ఎదుర్కొన్న పరాజయాన్ని 'అశ్వద్ధామ' సినిమాతో మరిపించాలని రంగంలోకి దిగాడు నాగశౌర్య. 133 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ లకు థాంక్స్ తెలుపుతూ మొదలై.. అలా స్టార్ట్ కాగానే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్లో ఓ డైలాగ్ ఆదిలోనే ఆకట్టుకుందని అంటున్నారు.
నీరసంగా.. ఆ తర్వాత
ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంది కానీ కథనం మాత్రం కాస్త నెమ్మదిగా ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు ప్రీమియర్స్ చూసిన జనం. మొదలు పెట్టడమే చాలా నీరసంగా మొదలుపెట్టారని, కాకపోతే కాసేపటి తర్వాత సినిమా వేగం అందుకుందని అంటున్నారు.
ఫస్టాఫ్ సస్పెన్స్ రైడర్.. 30 నిమిషాల్లో
'అశ్వద్ధామ' సినిమా కాస్త ఇంట్రెస్టింగ్గా ఉందని, స్టార్ట్ అయిన 30 నిమిషాల్లో సినిమా ఊపందుకొని పలు సన్నివేశాలు ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఫస్టాఫ్ సస్పెన్స్ రైడర్ అని చెబుతున్నారు.
మాస్ అవతారంలో నాగశౌర్య
యంగ్ హీరో నాగశౌర్య తొలిసారి పూర్తిగా మాస్ అవతారంలోకి మారి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబర్చడాని అంటున్నారు. ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఈ హీరో నటన బాగుందని టాక్ వస్తోంది. మొత్తంగా మాత్రం సినిమా యావేరేజ్ అంటున్నారు.
పోరాట సన్నివేశాలు.. మెహ్రీన్ నటన
నాగశౌర్య మరియు విలన్ మధ్య పోరాట సన్నివేశాలు ఫర్వాలేదనిపించాయని టాక్ వస్తోంది. చిత్రంలోని కొన్ని చేజింగ్ సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయని అంటున్నారు. హీరోయిన్ మెహ్రీన్ నటన కూడా ఫర్వాలేదని చెబుతున్నారు ఆడియన్స్.
నాగశౌర్య సొంత కథ.. స్వయంగా ఆయనే
అన్యాయం జరుగుతుంటే తప్పని ప్రతిఘటించిన ప్రతి ఒక్కరూ అశ్వద్దాములే అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించిన హీరో నాగశౌర్య.. ఈ కథను కూడా తానే రాసి దర్శకత్వ బాధ్యతలను రమణ తేజ చేతుల్లో పెట్టడం విశేషం.