twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యుద్దమే ధర్మం కానప్పుడు ధర్మయుద్దాలెక్కడివి.. ‘అర్దశతాబ్దం’ టీజర్ రచ్చ

    |

    ఒక్కోసారి కొన్ని పాటలు ఎప్పటికీ నిలిచిపోతుంటాయి. కొన్ని పాటలు జనాల ఆలోచనలు, మెదళ్ల నుంచి వెళ్లవు. అలానే స్థిరపడిపోతుంటాయి. అలా బాగా ఫేమస్ అయిన పాటల్లోని పదాలే సినిమా టైటిల్స్‌గా వస్తుంటాయి. అలనాటి ఓ క్లాసిక్ పాట, యువతను ఉర్రూతలూగించిన పాట అర్ధశతాబద్దపు అంటూ సిరివెన్నెల రాసిన పాట అందరిలోనూ నరనరాను ఎక్కి ఉంటుంది. అలాంటి అర్ధశతాబ్దం అనే టైటిల్‌తో ఓ సినిమా వస్తోందన్న సంగతి తెలిసిందే.

    ఆ మధ్య రిలీజ్ చేసిన అర్ధశతాబ్దం పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. రాజా రవీంద్ర, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర, కార్తీక్ రత్నం వంటి వారు నటిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఇందులోని కొన్ని డైలాగ్‌లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. 'యుద్దమే ధర్మం కానప్పుడు.. ధర్మయుద్దాలెక్కడివి'.. 'న్యాయం ధర్మం అవుతుంది కానీ.. ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు'.. 'ఈ స్వతంత్ర దేశంలో గణతంత్రం ఎవడికో.. ఎందుకో.. దేనికో.. ఈ విశాల భారతానికి అఖండ రాజ్యం..'వంటి డైలాగ్‌లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

     Naveen chandra And Karthik Rathnam Ardasatabdam Teaser

    ఇక వరుసగా ఫాంలో ఉన్న నవీన్ చంద్ర ఈసినిమాతో మరోసారి తన సత్తాను చాటేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ టీజర్ మాత్రం అందరినీ కట్టిపడేసేలానే ఉంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టికిరన్ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    English summary
    Naveen chandra And Karthik Rathnam Ardasatabdam Teaser
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X