Don't Miss!
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Finance Telecom News: వినియోగదారులకు టెలికాం కంపెనీల వాత.. ముహూర్తం ఫిక్స్..
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
కథేంటో తెలిసిపోయింది: మణిరత్నం ‘నవాబ్’ సెకండ్ ట్రైలర్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న 'చెక్క చివంత వానం' అనే తమిళ మూవీ తెలుగులో 'నవాబ్' పేరుతో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి ఇంప్రెషన్ ఏర్పరచగా.... తాజాగా సెకండ్ ట్రైలర్ వదిలారు. సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచే విధంగా ఉంది.
అన్నదమ్ముల మధ్య గొడవల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. గ్యాంగ్స్టర్ సేనాపతి(ప్రకాష్ రాజ్) మరణం తర్వాత... ఆ స్థానం కోసం ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధమే నవాబ్ సినిమా అని తాజాగా విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
అరవింద స్వామి (వరద), శింబు (ఎతి)న అరున్ విజయ్ (త్యాగు) సేనాపతి కుమారులుగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. విజయ్ సేతుపతి, జ్యోతిక, అదితిరావు హైదరి, ఐశ్వర్యరాజేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనే విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి ఒక సస్పెన్స్తో కూడిన గ్యాంగ్స్టర్ థ్రిల్లర్గా మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.